Israel Iran War: ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రతీకారంతో డ్రోన్ లను ప్రయోగించడంతో పశ్చిమాసియా లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అక్కడ ఉన్న మన దేశ పౌరులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే భారతీయులు అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు జారీ చేసింది.
టెల్అవీవ్ – టెహ్రాన్ మధ్య శత్రుత్వం పెరగడంపై ఆందోళన చెందుతున్నట్లు న్యూఢిల్లీలో విదేశాంగ శాఖ పేర్కొంది. దాడుల నేపథ్యంలో ఆందోళన చెందవద్దని పౌరులకు ధైర్యం చెప్పింది. స్థానిక అధికారులు జారీ చేసిన భద్రతా ప్రోటోకాల్ ను అనుసరించాలని సూచించింది. ఇజ్రాయెల్ లోని భారత రాయబార కార్యాలయంలో హెల్ప్ లైన్ నంబర్లను సంప్రదించి తమ వివరాలు నమోదు చేసుకోవాలని కోరింది.
పశ్చిమాసియాలోని ప్రస్తుత పరిస్థితులను మన విదేశాంగ శాఖ జాగ్రత్తగా గమనిస్తొంది. ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య పెరుగుతున్న ఘర్షణ వాతావారణంపై ఆందోళన వ్యక్తం చేసిన భారత్ .. ఇరు దేశాలు సంయమనంతో శాంతి మార్గంలో సమస్యను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చింది. ఈ ప్రాంతంలో భద్రత, స్థిరత్వం ఎంతో ముఖ్యమని.. దౌత్య మార్గంలో ముందుకు సాగడమే మేలని హితవు పలికింది.
మరో పక్క.. హార్మూజ్ జలసంధి సమీపంలో స్వాధీనం చేసుకున్న నౌకలోని 17 మంది భారతీయుల విడుదల కోసం ఇరాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది.
Israel Iran War: ఇజ్రాయెల్ పై ఇరాన్ వందలాది డ్రోన్లు, క్షిపణులతో దాడి ..ఏమి జరిగిందంటే..?