Megastar chiranjeevi: ఖైదీ నంబర్ 150 తో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి వరుసగా నాలుగు ప్రాజెక్ట్స్ని లైన్లో పెట్టారు. వాటిలో సైరా సినిమాను పాన్ ఇండియన్ స్థాయిలో రూపొందించారు. ప్రభాస్ తర్వాత పాన్ ఇండియన్ సినిమా చేసింది మెగాస్టారే. ఆ తర్వాత ఆచార్య సినిమాను పట్టాలెక్కిస్తూనే మెహర్ రమేశ్ వేదాలం రీమేక్, మోహన్ రాజాతో లూసీఫర్ రీమేక్ చేయనున్నట్టు ప్రకటించారి. ఇదే సమయంలో యంగ్ డైరెక్టర్ బాబి దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ కొరటాల శివ, మెహర్ రమేశ్, బాబి, మోహన్ రాజాలతో కలిసి ఫొటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇలా అందరు యంగ్ డైరెక్టర్స్కి అవకాశం ఇస్తున్న మెగాస్టార్ కోసం ఇంకా పూరి జగన్నాథ్, బోయపాటి శ్రీను, వి.వి.వినాయక్ లైన్లో ఉన్నారు. వీరే కాదు మరికొంతమంది కోలీవుడ్ డైరెక్టర్స్ కూడా చిరంజీవితో సినిమా చేయాలని కథ పట్టుకొని కూర్చున్నారు. కానీ కరోనా వల్ల మెగాస్టార్ ప్రస్తుతం కమిటయిన సినిమాలను మాత్రమే ముందు పూర్తి చేసి ఆ తర్వాత కొత్త ప్రాజెక్ట్స్ మీద సైన్ చేయాలనుకుంటున్నారట. కానీ తాజాగా దర్శకుడు మారుతి లైన్లోకి వచ్చాడు. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
Megastar chiranjeevi: లైన్తో ఏకంగా మెగాస్టార్నే లైన్లో పెట్టిన మారుతి..!
దాసరి మారుతి ఇటీవల మెగాస్టార్ని కలిసి లైన్ చెప్పి ఇంప్రెస్ చేశాడట. ఆయనకి లైన్ బాగా నచ్చడంతో పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ చేసి తీసుకు రమ్మని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. మారుతి ఇప్పటి వరకు వెంకటేశ్, నాని, శర్వానంద్, సాయి ధరం తేజ్లతో చేశాడు. చాలాకాలం నుంచి మెగా ఫ్యామిలీ హీరోలతో సినిమాలు చేయాలని ట్రై చేస్తున్నాడు. కానీ కుదరలేదు. అయితే ఏకంగా ఇప్పుడు లైన్తో ఏకంగా మెగాస్టార్నే లైన్లో పెట్టినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ ఓకే అయినా మారుతి రెండేళ్ల వరకు ఆగాల్సిందే.
Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!