టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ – కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న రంగ్ దే ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలని జరుపుకుంటోంది. సంక్రాంతి సందర్భంగా సినిమాని రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకి ఇప్పటికే ప్రేక్షకుల్లో పాజిటివ్ బజ్ క్రియోటయింది.
కాగా నెక్స్ట్ సినిమా టాలెంటెడ్ డైరెక్టర్ చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వంలో చేస్తున్నాడు. చెక్ అన్న టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయున్స్ గా నటిస్తున్నారు. థ్రిల్లిర్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని భవ్య క్రియోషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
రీసెంట్ గా ఈ సినిమా నుంచి నితిన్ – రకుల్ – ప్రియా ప్రకాష్ వారియర్ ల పోస్టర్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చి సినిమా మీద ఆసక్తి పెంచాయి. కాగా ఈ సినిమాలో మూడో హీరోయిన్ కూడా నటించనుండగా మేఘా ఆకాష్ ని ఎంచుకున్నట్టు సమాచారం.
గతంలో నితిన్ – మేఘా ఆకాష్ కలిసి లై, ఛల్ మోహన రంగ సినిమాలు చేశారు. ఈ రెండు సినిమాలు ఫ్లాపయ్యాయి. అయినా సాహసం చేసి మరోసారి మేఘా ఆకాష్ నే ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. మరి ఇది ఎంతవరకు నిజమన్నది అధికారక ప్రకటన వెలువడితేగాని క్లారిటీ రాదు.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!