యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ అనుకున్న ప్లాన్ ప్రకారం వరసగా మూడు భారీ ప్రాజెక్ట్స్ కమిటయి 2022 వరకు ఖాళ్లీ లేకుండా ఉన్నాడు. ఈ మూడు భారీ ప్రాజెక్ట్స్ లో రెండిటిని ఒకే సంవత్సరంలో కాస్త గ్యాప్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ వేసుకున్నాడు. అందులో ఒకటి దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్.
ఈ సినిమాని డివీవీ దానయ్య 350 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. భారీ పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రాం చరణ్, బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్, అజయ్ దేవ గన్, శ్రియ శరణ్, ఓలియా మోరిస్ లాంటి భారీ తారాగణం ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాతో పాటు మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్.టి.ఆర్ తన 30 వ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ రెండు సినిమాలని ఒకటి లేదా రెండు నెలల గ్యాప్ లో రిలీజ్ అయ్యోలా అనుకుంటే ఆ ప్లాన్స్ అన్ని దారుణంగా దెబ్బ తిన్నాయి. ఆర్ ఆర్ ఆర్ కారణంగా ఎన్టీఆర్ 2019 లో ఒక్క సినిమా కూడా కమిటవలేదు. ఇక 2020 నుండి ఆర్ ఆర్ ఆర్ విడుదల 2021 జనవరికి వాయిదా పడడంతో 2020 కూడా ఎన్టీఆర్ కి జీరో ఇయర్ గా మిగిలిపోయింది.
ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ పూర్తి చేసి ఆ తరువాత త్రివిక్రమ్ సినిమా లో జాయిన్ అవుతాడు. ఈ రెండు సినిమాలు వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోయో భారీ ప్రాజెక్ట్ లో కి అడుగు పెడతాడట.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!