దేశంలో నాకంటే సీనియర్ రాజకీయ నాయకుడు లేడు నేనే అందరికంటే సీనియర్ నాయకుడిని మోడీ కూడా నాకంటే జూనియర్ అని 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ చంద్రబాబు తెగ గొప్పలు చెప్పుకుంటారు. రాజకీయాలలో చాణిక్యుడు అనే టైటిల్ కలిగిన చంద్రబాబు నాయుడిని ఢీ కొనాలంటే చాలా కష్టం అంటూ తెలుగు రాజకీయాల్లో మహా మహా నేతలే చేతులెత్తేసారు అంటూ ఆయన వేసే వ్యూహాలపై సీనియర్స్ చాల మంది కామెంట్లు చేస్తుంటారు. అటువంటి చంద్రబాబుని 2019 ఎన్నికలలో కోలుకోలేని దెబ్బ జగన్ కొట్టడం జరిగింది. మూడు దశాబ్దాల చరిత్ర కలిగిన టిడిపిని 23 సీట్లకు పరిమితం చేసి కొన ఊపిరితో అన్నట్టుగా ప్రతిపక్షంలో చంద్రబాబు ని జగన్ కూర్చోబెట్టారు.
దీంతో ఊహించని విధంగా భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన జగన్… టీడీపీని నామరూపాలు లేకుండా చేయాలని రాజకీయంగా మరియు సామాజిక వర్గ పరంగా అదేరీతిలో ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ మీద దెబ్బలు కొడుతూనే ఉన్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు ఆయన ప్రతిపక్ష కుర్చీకి ఎసరు పెట్టాలనే రీతిలో జగన్ సరికొత్త స్ట్రాటజీ వేసినట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళితే చంద్రబాబు ఏ రకంగా రాజకీయాల్లోకి 40 ఏళ్ల క్రితం అడుగు పెట్టారో, అనగా సింగిల్ గా 1978లో కాంగ్రెస్ పార్టీలో ఎలా ఉన్నారో అదే రీతిలో టిడిపిలో చివరాకరికి బాబు ని సింగిల్ చేయడానికి జగన్ గంటాతో సరికొత్త స్ట్రాటజీ వేసినట్లూ ఏపీ రాజకీయాలలో వార్తలు వినపడుతున్నాయి.
పూర్తి మేటర్ లోకి వెళ్తే విశాఖ నార్త్ ఎమ్మెల్యే మాజీ మంత్రి టిడిపి నాయకుడు గంటా శ్రీనివాసరావు త్వరలో వైసీపీలో చేరనున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు గంటా శ్రీనివాస్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆయనతో 12 మంది టిడిపి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పెద్దఎత్తున జగన్ సమక్షంలో చేరటానికి రెడీగా ఉన్నట్లు సమాచారం. దీంతో ఇదే గనుక జరిగితే చంద్రబాబుకి ఉన్న ప్రతిపక్ష హోదా కోల్పోవటం గ్యారెంటీ అని చంద్రబాబు మళ్లీ ఫ్లాష్ బ్యాక్ పొలిటికల్ సినిమా రిపీట్ అయినట్లే అని….విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. మరి ఏడు పదుల వయసు కలిగిన చంద్రబాబు ఇలాంటి జగన్ రాజకీయ దెబ్బ తట్టుకోగలడా అన్నా డిస్కషన్లు మరోపక్క ఏపీ రాజకీయాల్లో వినబడుతున్నాయి.