కర్ణాటకలో కరోనా నుండి కోలుకున్న జనాలు తమ ప్లాస్మా కనుక డొనేట్ చేయడానికి అంగీకరిస్తే వారికి ప్రోత్సాహకంగా 5,000 రూపాయల నగదు బహుమతిని ప్రకటించింది కర్ణాటక ప్రభుత్వం. ఈ నగదు బహుమతి ప్రజలు ప్లాస్మాను డొనేట్ చేయడానికి ముందుకు రావడానికి ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
కరోనా నుండి కోలుకున్న ప్రజల ప్లాస్మా, ప్రస్తుతం కరోనాతో బాధపడుతున్న బాధితులకు కోలుకోవడానికి ఉపయోగపడుతుందని అంటున్నారు. అందుకోసమే ప్రభుత్వం ఈ ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. ఇప్పటిదాకా దాదాపు 17వేలకు పైగా కరోనా నుండి కోలుకున్నారు. అందులో దాదాపు 5 వేల మంది బెంగళూరులోనే ఉన్నారు. వీరిలో కొంత మంది ప్లాస్మా డొనేట్ చేయడానికి ముందుకు వచ్చినా అది బాధితులకు ఉపయోగపడుతుంది. ప్లాస్మా కనుక ట్రాన్స్ఫర్ చేస్తే అది కోలుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది.