KCR: గత కొద్దికాలంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. వరంగల్ లో చారిత్రక జైలు కూల్చివేసి అక్కడ భారీ ఆస్పత్రికి శ్రీకారం చుట్టారు. ఇదే రీతిలో ఎర్రగడ్డలోని చెస్ట్ ఆస్పత్రిని సైతం కూల్చివేసి సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ నిర్మించనున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తో కలిసి ఎర్రగడ్డ ఆస్పత్రిని సందర్శించి కీలక ప్రకటన చేశారు.
Read More: KCR: కేసీఆర్ మంత్రులకు చెప్పుదెబ్బలే…షర్మిల పార్టీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
మంత్రి ఏమంటున్నారంటే…
మంత్రి తలసాని ఈ సందర్భంగా మాట్లాడుతూ 62 ఎకరాల్లో ఉన్న చెస్ట్ హాస్పిటల్ ఆవరణలో ఉన్న సుమారు 44 ఎకరాల విస్తీర్ణంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. ఈ క్రమంలో సమగ్ర ప్రణాళిక తయారీ కోసం హాస్పిటల్ లో ఎమ్మెల్యే, అధికారులతో కలిసి పర్యటించి, పరిశీలించినట్టు చెప్పారు. మంచి కొవిడ్ సేవలు అందించిన చెస్ట్ ఆస్పత్రిలో ప్రస్తుతం 300కు పైగా బెడ్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయన్నారు. అన్ని హంగులతో టీబీ , చెస్ట్ ఆస్పత్రులను కలుపుతూ పెద్ద హాస్పిటల్ రాబోతోందన్నారు. నూతన ఆస్పత్రితో 1000 నుంచి 1200 బెడ్స్ అందుబాటులోకి వస్తాయని తలసాని పేర్కొన్నారు.
Read More: KCR: గల్లీలో కొట్లాట… ఢిల్లీలో ఒకే మాట అంటున్న కేసీఆర్ , జగన్
10000 కోట్లు
హైదరాబాద్ నగరానికి నాలుగు దిక్కుల నాలుగు సూపర్ స్పెషలిటీ హాస్పిటల్స్ రాబోతున్నాయని మంత్రి అన్నారు.రూ.10వేల కోట్లు ఖర్చు అయినా పర్వాలేదని సీఎం కేసీఆర్ చెప్పారని మంత్రి అన్నారు. రాబోయే రోజుల్లో హెల్త్ మీద దృష్టి పెట్టడం అనివార్యంగా మారింది కాబట్టి…. అత్యాధునిక ఏర్పాట్లను చేయబోతున్నామన్నారు. వచ్చే వారం ఉస్మానియా ఆసుపత్రి కూడా వెళ్తామని, ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి కూడా రిక్వెస్ట్ చేయబోతున్నట్టు మంత్రి తలసాని చెప్పారు.