దుబ్బాక ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ ఓటమి చెందడంతో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయడానికి భయపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల బాధ్యతను టిఆర్ఎస్ పార్టీ తరఫున పర్యవేక్షిస్తున్న కేటీఆర్ కి ఓటమి టెన్షన్ పట్టుకున్నట్లు టాక్. పూర్తి మ్యాటర్ లోకి వెళితే ఇటీవల కుండపోత వర్షాలు గట్టిగా కురియడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడటం తో పాటు ప్రభుత్వ సాయం పెద్దగా అందకపోవటంతో ప్రజలలో వ్యతిరేఖత గట్టిగా ఉన్నట్లు టాక్ నడుస్తోంది.
మరోపక్క దుబ్బాక ఉప ఎన్నికలలో గెలవడంతో బీజేపీ గ్రేటర్ మేయర్ పీఠాన్ని కూడా దక్కించుకునే రీతిలో పావులు కదుపుతోంది. తెలంగాణ బిజెపి పార్టీ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన బండి సంజయ్ ఏదో రీతిలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సత్తా చాటాలని టిఆర్ఎస్ పార్టీ ని వెనక్కి నెట్టాలని ఇప్పటి నుండే పక్కా వ్యూహాలతో ముందుకు సాగుతున్నరట.
ఇదిలా ఉండగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం లేదని, కాబట్టి ఎన్నికలను పోస్ట్ పోన్ చేస్తే ఎలా ఉంటుందని కేటీఆర్ భావిస్తున్నారట. ఆ లోపు ఓ సర్వే చేయించాలని దానికనుగుణంగా సరికొత్త స్ట్రాటజీ తో ముందుకు వెళ్లాలనే ఆలోచనలో కేటీఆర్ ఉన్నట్లు టిఆర్ఎస్ పార్టీలో టాక్. గ్రేటర్ ఎన్నికల లో కూడా బీజేపీ గెలిస్తే మాత్రం తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ పక్కకు వెళ్ళటం గ్యారెంటీ అని పరిశీలకుల మాట. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ నెలలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ఎన్నికల సంఘం ఆలోచన చేస్తుండగా టిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం సంక్రాంతి పండుగ తర్వాత అయితే బాగుంటుందని జిహెచ్ఎంసి ఎన్నికల విషయంలో వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం.