అవకాశాలు మెరుగ్గా ఉన్నాయనో, జీతాలు అధికంగా ఉన్నాయనో.. కారణం ఏదైనా విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న భారతీయుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది! ఈ క్రమంలో కువైట్ లో ఉంటున్న భారతీయులకు ఆ పార్లమెంట్ భారీ షాక్ ఇచ్చింది. దాదాపు 43 లక్షల జనాభా (42,70,571) కలిగిన కువైట్ దేశంలో సుమారు 15 లక్షలు మంది భారతీయులే ఉన్నారంట. ఈ విషయాన్ని ఏమాత్రం తట్టుకోలేకపోతుందంట అక్కడి ప్రభుత్వం!
దీంతో కారణం కరోనా అని చూపిస్తూ… అక్కడి నుంచి సగానికి పైగా ఇండియన్లను పంపేయాలని సంచలన నిర్ణయం తీసుకుంది కువైట్ పార్లమెంట్. ఇది కేవలం రాజకీయ ప్రకటన అనుకుంటే పొరపాటే… ఈ విషయంపై భారతీయుల సంఖ్యను పరిమితం చేసే “దేశజనాభాలో 15 శాతానికి మించి ఇండియన్లు తమ దేశంలో ఉండకూడదన్న బిల్లు”కు కువైట్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
కరోనా వైరస్ మహమ్మారి రోజు రోజుకీ పెరిగిపోతున్న తరుణంలో… ఆ దేశంపై పడుతున్న ఆర్థిక, సామాజిక, మెడికల్ భారాలను కంట్రోల్ చేసుకోవడానికే కువైట్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెబుతుంటుండగా.. చరిత్రలో ఎన్నారైలకు ఈ రేంజ్ లో ఇంత పెద్ద షాక్ ఏ దేశంలోను తగల్లేదనే చెప్పుకోవాలి.! పైగా.. ఎట్టి పరిస్థితుల్లోను ఇందులో మినహాయింపులు ఉండబోవని కూడా ప్రభుత్వం చెబుతున్నదాన్ని బట్టి చూస్తె… కువైట్ లో నివసిస్తున్న ఎన్నారైలలో దాదాపు ఎనిమిది లక్షల మంది భారతీయులు ఇండియాకు తిరిగి రాక తప్పదన్నమాట!! ఇది మామూలు షాక్ కాదు!
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!