Mahesh Trivikram: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది నెలల క్రితం ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన సినిమా నిర్మాణ సంస్థ హారిక హాసిని క్రియేషన్స్ అధికారికంగా వీడియో ద్వారా తెలియజేయడం జరిగింది. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటించిన అతడు, ఖలేజా సినిమాలు ప్రేక్షకులను అదే రీతిలో అభిమానులను ఎంతగానో అలరించాయి. రెండు సినిమాలలో కూడా మహేష్ లో ఉన్న సరికొత్త నటనను బయటకు తీశారు డైరెక్టర్ త్రివిక్రమ్.
పైగా రెండు సినిమాలు పూర్తి భిన్నంగా ఉంటాయి. అతడు సినిమాలో చాలా కామ్ గా ఉంటే ఖలేజా సినిమాలో పూర్తిగా కామెడీ తరహా నటన మహేష్ కనపరచడం జరిగింది. రెండు సినిమాలలో కూడా మహేష్ ని పూర్తిగా అభిమానులు సరికొత్తగా చూశారు. దీంతో ఈ మూడో సినిమాల్లో మహేష్ బాబు లో ఉన్న మరోకోణం త్రివిక్రమ్ చూపెడతాడు ఏమో అని.. ఫ్యాన్స్ డిస్కషన్ లు చేసుకుంటున్నారు.
Read More: Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ఫస్ట్ క్రష్ హీరోయిన్ డీటెయిల్స్..!!
మరోపక్క ఇదే టైం లో కరోనా కారణంగా చాలా సినిమాలు లేట్ అయ్యే పరిస్థితులు కనబడుతూ ఉండటంతో ఈ సినిమా స్టార్ట్ చేయకముందు సరికొత్త షెడ్యూల్ త్రివిక్రమ్ ప్లాన్ చేసినట్లు పూర్తిగా ఒక ప్రదేశం లోనే మేజర్ పార్ట్ షూటింగ్ ఉండేలా.. షెడ్యూల్స్ డిజైన్ చేసినట్లు లాక్ డౌన్ అమలు చేసినా గాని షూటింగ్ ఎటువంటి అంతరాయం కలగకుండా ముందుగానే జాగ్రత్త పడినట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది. ఏది ఏమైనా “అలా వైకుంఠపురం లో” సినిమా తర్వాత చాలా లాంగ్ గ్యాప్ వచ్చిన నేపథ్యంలో మహేష్ సినిమా అతి తక్కువ టైంలో కంప్లీట్ చేయాలని త్రివిక్రమ్ సరికొత్త ప్లాన్ వేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వస్తుంది.