ఎస్ యూవీ విడుదలైన అతి తక్కువ కాలంలోనే ఒక కొత్త సంచలనం సృష్టించింది.. భారత మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఎస్ యూవీ లలో మహీంద్రా స్కార్పియో ఒకటి.. ఇది చాలా కాలంగా భారత మార్కెట్లో అమ్ముడవుతోంది.. మహీంద్రా తన న్యూ జనరేషన్ స్కార్పియో స్టింగ్ ఎస్ యూవీ ని వచ్చే ఏడాది భారత మార్కెట్లో విడుదల చేయుటకు సన్నాహాలు చేస్తోంది..! ఈ స్కార్పియో ని ఇప్పటికే భారత దేశంలో అనేక సార్లు టెస్ట్ నిర్వహించింది. పూర్తి వివరాలు ఇలా..
ఫీచర్స్:
ఇందులో సరికొత్త 2.0 లీటర్ లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ ఉంది. ఇంజన్ 155 బిహెచ్పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది ఇందులో 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ వ్యవస్థను జత చేశారు దీనికి ఫోర్ డబ్ల్యు డి సిస్టం ఉంది ఈ స్కార్పియో ఎస్ యు వి కొత్త ల్యడర్ ఫ్రేమ్ ఛాయిస్ మీద ఆధారపడి ఉంటుంది.
దీని ఇంటీరియర్ క్యాబిన్ ఆపిల్ కార్ ప్లే ,ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, సెంట్రల్ కన్సోల్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, హెడ్ ల్యంప్స్, కి గ్రీల్ ఎలిమెంట్స్, టెయిల్ గేట్ , సైడ్ హింగ్డ్ బూట్ ఓపెనర్ ఉంది. మహీంద్రా సిరీస్ కార్ల అమ్మకాలకు స్కార్పియో సహకారం ఎంతో ఉంది. కొన్ని నివేదికల ప్రకారం మహీంద్రా కంపెనీ స్కార్పియో స్టింగ్ కోసం ట్రేడ్ మార్క్ దరఖాస్తును దాఖలు చేసింది.