YSRCP: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్దం బస్సు యాత్ర ఇవేళ అన్నమయ్య జిల్లాలో కొనసాగనుంది. బస్సు యాత్రకు ప్రజలు, పార్టీ శ్రేణుల నుండి విశేష స్పందన లభిస్తొంది. ప్రతి రోజు ఉదయం స్టే పాయింట్ వద్ద ఆయా ప్రాంతాలకు చెందిన వివిధ పార్టీల నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నారు.
చీకటిమునిపల్లె స్టే పాయింట్ వద్ద ఇవేళ పలువురు నేతలు వైసీపీలో చేరారు. బీజేపీ రాజంపేట జిల్లా మాజీ అధ్యక్షుడు డాక్టర్ ఏవీ సుబ్బారెడ్డి, మదనపల్లె టీడీపీ మైనార్టీ నేత మొబసిర్ అహ్మద్, కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలానికి చెందిన టీడీపీ సీనియర్ నతే ఎం గంగాధర్ తదితరులు వైసీపీలో చేరారు. వీరికి సీఎం వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
నేడు అన్నమయ్య జిల్లాలో జగన్ బస్సు యాత్ర కొనసాగనుండగా, ఆ జిల్లాకు చెందిన పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు చీకటిమునిపల్లె స్టే పాయింట్ వద్దకు చేరుకున్నారు. అన్నమయ్య జిల్లాలో ములకలచెరుపు వద్ద గజమాలతో సీఎం జగన్ కు ఘనస్వాగతం పలికారు.
పెదపాలెం, వేపురికోట మీదుగా బుర్రకాయలకోట క్రాస్, గొల్లపల్లి, అంగళ్లు వరకూ యాత్ర కొనసాగనుంది. సాయంత్రం మదనపల్లె లో వైసీపీ మేమంతా సిద్దం బహిరంగ సభ లో జగన్ ప్రసంగించనున్నారు. సభ అనంతరం నిమ్మనల్లి క్రాస్, బోయకొండ క్రాస్, చౌడేనపల్లి సోమల మీదుగా అమ్మగారిపల్లె వరకూ ఆరో రోజు బస్సు యాత్ర సాగనుంది. రాత్రికి అమ్మగారిపల్లెలొనే సీఎం జగన్ బస చేయనున్నారు. దారిపొడవునా ఆత్మీయ స్వాగతం పలికేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారు.
YSRCP: సత్యసాయి జిల్లాలో అడుగడుగునా జగన్ కు జన నీరాజనాలు