కరోనా వైరస్ దెబ్బకు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ తమ వ్యాపారాలు చేసుకోలేని వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. కొత్తగా మోడీ ప్రవేశపెట్టిన స్కీమ్ కింద ఒక్కొక్కరికి పది వేల రూపాయల రుణం ఇవ్వబడుతుంది. కరోనా వైరస్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడగా దాదాపు అన్ని రంగాలు చతికిలపడ్డాయి. ముఖ్యంగా వలస కూలీలు ,కార్మికులు చిరు వ్యాపారులు, రైతులు, వీధి వ్యాపారులు తోపుడుబండ్ల పైన వ్యాపారం చేసుకునే వారు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన స్వనిధి స్కీమ్ వీధి వ్యాపారులను ఆదుకోవడానికి ఉపయోగపడుతుంది. మోదీ సర్కార్ ప్రధానమంత్రి స్కీమ్ కింద వ్యాపారులకు సులభంగానే రుణాలను అందిస్తోంది. స్వనిధి స్కీమ్ కింద రూ.10000 వరకు రుణం తీసుకోవచ్చు. తీసుకున్న రుణాన్ని ఏడాదిలోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఒకేసారి కాకుండా ఈఎమ్ఐ రూపంలో కూడా మొత్తాన్ని చెల్లించే వెసులుబాటుని కూడా కల్పించారు.
ఈ ప్రధాన్ మంత్రి స్వనిధి స్కీం ద్వారా దాదాపు ఐదు కోట్ల మంది వీధి వ్యాపారులకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. తీసుకున్న మొత్తం కరెక్ట్ టైమ్ కి తిరిగి చెల్లిస్తే… 7 శాతం వడ్డీ రేటు వస్తుందని పేర్కొన్నారు. ఆ వడ్డీ మొత్తం తిరిగి వ్యాపారుల బ్యాంక్ అకౌంట్ లోకే తిరిగి జమ అవుతుందని కూడా చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం అతిత్వరలోనే ఈ స్కీమ్కు సంబంధించిన ప్రత్యేకమైన ప్లాట్ఫామ్ను లాంచ్ చేయనుంది. బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు, ఎన్బీఎఫ్సీలు, సిడ్బీ, మైక్రోఫైనాన్స్ సంస్థలు వంటివి అన్నీ ఇందులో భాగం కానున్నాయి. దీంతో ఆన్లైన్లోనే సులభంగా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. తొలి దశలో జూలై నుంచి 108 పట్టణాల్లో ఈ స్కీమ్ అందుబాటులోకి రానుంది.