‘నువ్వు తోపురా’ చిత్రంలో హీరోగా నటిస్తున్న సుధాకర్ ప్రయాణిస్తున్న కారు శనివారం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ‘నువ్వు తోపురా’ చిత్రానికి సంబంధించిన ఓ ఈవెంట్లో పాల్గొనేందుకు కారులో గుంటూరు బయుల్దేరారు. మంగళగిరి వద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు ఢీకొని లక్ష్మి అనే మహిళ మృతి చెందింది. అయితే ఈ ఘటనలో తానే డ్రైవింగ్ చేస్తున్నట్టు వచ్చిన వార్తలను సుధాకర్ ఖండించారు. ఈ మేరకు హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో చిత్ర బృందం మీడియాతో సమావేశమైంది. ఈ సందర్భంగా సుధాకర్ ఘటన జరిగిన విధానాన్ని వివరించారు. ‘‘నా జీవితంలో మర్చిపోలేని దుర్ఘటన ఇది. ప్రమాదం జరిగిన సమయంలో నేను డ్రైవర్ పక్క సీటులో ఉన్నాను. కారు ట్రక్కుకు తగలడంతో ప్రమాదం జరిగింది. నేను డ్రైవింగ్ చేయలేదు. నిజాన్ని ప్రజలకు తెలియజేయండి. మహిళ మృతి నన్నెంతగానో బాధించింది. కారు నడిపిన డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఐసియులో ఉన్నారు. మృతురాలు కుటుంబానికి నేను, మా యూనిట్ ఆర్థికంగా సాయం అందిస్తాం’’ అన్నారు.
previous post
next post
Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!