Chiranjeevi: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగా కాంపౌండ్ నుండి దాదాపు అరడజను మంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. చిరంజీవి ఇమేజ్ తో ఈ హీరోలంతా వెండితెరకు పరిచయం అయ్యి ఎవరికి వారు టాలెంట్ నిరూపించుకొని.. విజయవంతంగా రాణిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లో జరిగిన సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివల్ లో అల్లు అరవింద్ మెగా హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ నుంచి అల్లూ శిరీష్ వరకు అందరూ చిరంజీవి వేసిన బాటలో నడుస్తూ సిని కెరియర్ ను నిర్మించుకున్నారని తెలిపారు. అంత పెద్ద రహదారి వేశారు ఆయన అంటూ అల్లు అరవింద్ కామెంట్లు చేశారు.
అంతేకాకుండా ఇండస్ట్రీలో చాలామంది యువనటులకు చిరంజీవి స్ఫూర్తిగా నిలిచారని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్యఅతిథిగా రావటంతో మెగాస్టార్ కు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రకటించినందుకు సినీ ప్రముఖులు ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ ఇచ్చిన స్పీచ్ మెగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకోవడం జరిగింది. చిరంజీవి ప్రస్తుతం “విశ్వంభర” సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
వచ్చే ఏడాది జనవరి నెలలో సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారు. చిరంజీవి కెరియర్ లోనే అత్యంత హై బడ్జెట్ సినిమాగా ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఎంఎం కీరవాణి సంగీతమందిస్తున్నారు. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ గ్రాఫిక్స్ వర్క్ కి భారీగా ఖర్చు చేస్తున్నారట. “విశ్వంభర” సినిమా కోసం చిరంజీవి బరువు కూడా తగ్గడం జరిగింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఉన్నారు. గత ఏడాది రెండు సినిమాలు విడుదల చేశారు. ఈ ఏడాది ఎక్కువ సమయం “విశ్వాంభర” కి కేటాయించడం జరిగింది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!