Prabhas Allu Arjun: ప్రపంచవ్యాప్తంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ కీర్తించబడుతున్న సంగతి తెలిసిందే. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తెలుగు సినిమాలకు ప్రజెంట్ మంచి డిమాండ్ ఉంది. రాజమౌళి దయతో బాహుబలి 2, RRR సినిమాలు ప్రపంచ సినిమా రంగంలో అనేక రికార్డులు క్రియేట్ చేశాయి. “RRR” ఆస్కార్ అవార్డు కూడ గెలవడం జరిగింది. అదేవిధంగా “పుష్ప” సినిమా కూడా ప్రపంచాన్ని షేక్ చేసింది. ఇండియాలో సౌత్ ఫిలిం ఇండస్ట్రీ టాలెంట్ రోజురోజుకి విస్తరిస్తూ ఉంది. ప్రాముఖ్యంగా తెలుగు సినిమాలకు తిరుగులేని మార్కెట్ ఉంది.
ఈ క్రమంలో తాజాగా “మా” అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. విషయంలోకి వెళ్తే తెలుగు చలనచిత్ర పరిశ్రమ గురించి మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ రావటం సంతోషించదగ్గ విషయం అని అన్నారు. మొట్టమొదటి తెలుగు నటుడుకి పద్మ విభూషణ్ రావటం జరిగిందని అన్నారు. ఇది తెలుగు చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఉత్తరాదిలో ముఖ్యంగా ముంబైలో పబ్స్ లో బాలయ్య సాంగులకు మంచి క్రేజ్ ఉందని చెప్పుకొచ్చారు. ఇంక నా సహోదరుడు అల్లు అర్జున్ .. మొట్టమొదటి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్న తొలి తెలుగు హీరో. కేరళలో అల్లు అర్జున్ కి తిరుగులేని ఇమేజ్ ఉంది.
అక్కడ ఉన్న హీరోలకు తగ్గట్టు మన అల్లు అర్జున్ సినిమాలు ఆడతాయి. మలయాళ హీరోలతో సమానంగా తెలుగు హీరో కేరళలో రాణించడం విశేషం. ఇంకా అదే విధంగా నా ప్రియమైన సహోదరుడు ప్రభాస్.. నేడు ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరో. ఏ భాషలలోనైనా ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుందంటే మిగతా వాళ్ళు ఆలోచించే పరిస్థితి నెలకొంది. అంత పాపులారిటీ ఉన్నాగాని ప్రభాస్.. చాలా సైలెంట్ గా ఉంటాడు.. అది తెలుగువారి గొప్పదనం అని మంచు విష్ణు సంచలన స్పీచ్ ఇవ్వడం జరిగింది.