Allu Arjun: ఈ సంక్రాంతి పండుగకు “గుంటూరు కారం” విడుదలయ్యి యావరేజ్ సినిమాగా నిలిచింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలయ్యి అభిమానులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. మహేష్ డాన్స్ తప్ప సినిమాలో విషయం లేదని… త్రివిక్రమ్ పనితనం బాగోలేదని అభిమానులు మండిపడ్డారు. దీంతో గుంటూరు కారం లెక్కలు తప్పడంతో.. త్రివిక్రమ్ తో చేయాల్సిన సినిమా విషయంలో అల్లు అర్జున్ పూర్తిగా ప్లాన్ మార్చినట్టు వార్తలు వస్తున్నాయి. “పుష్ప 2” చేస్తున్న సమయంలోనే త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయింది. అధికారిక ప్రకటన కూడా రావడం జరిగింది.
కానీ “”గుంటూరు కారం ఫలితంతో అల్లు అర్జున్ త్రివిక్రమ్ ప్రాజెక్టును పక్కనపెట్టి ఇప్పుడు మరో రెండు ప్రాజెక్టులు తెరపైకి తీసుకొచ్చినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళ్తే టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి దర్శకత్వంలో ఒక పెద్ద పాన్ ఇండియా సినిమా చేయడానికి.. రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో కోలీవుడ్ కుర్ర స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో కూడా సినిమా చేయనున్నారని సమాచారం. ఈ రెండు ప్రాజెక్టులు కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు త్రివిక్రమ్ సినిమా బన్నీ చేసే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీలో కొత్త వార్త వైరల్ అవుతుంది. అంతేకాదు బోయపాటితో బన్నీ చేయబోయే ప్రాజెక్టుని గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ నిర్మించబోతున్నారట.
త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతున్నట్లు టాక్. 2016లో బోయపాటి దర్శకత్వంలో అల్లు అర్జున్ “సరైనోడు” అనే సినిమా చేయడం జరిగింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు అదే తరహాలో మరో పాన్ ఇండియా సబ్జెక్టు బన్నీ కోసం సిద్ధం చేసినట్లు సమాచారం. “పుష్ప 2” కంప్లీట్ అయిన వెంటనే బోయపాటి ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పుష్ప సెకండ్ పార్ట్ ఆగస్టు 15వ తారీకు విడుదల కాబోతోంది. సో ఈ సినిమా అయినా వెంటనే బోయపాటి ఆ తర్వాత అట్లీ సినిమాలు చేయాలని బన్నీ ప్లాన్. సో మొత్తం మీద మూడు సంవత్సరాల తర్వాత త్రివిక్రమ్ ప్రాజెక్టు అల్లు అర్జున్ సెట్స్ మీదకు తీసుకెళ్లే ఛాన్సెస్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.