Allu Arjun : టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ కి తిరుగులేని క్రేజ్ వున్న సంగతి తెలిసిందే. బన్నీ సినిమాలు ఒక తెలుగులో మాత్రమే కాక దక్షిణాది సినిమా రంగంలో అనేక భాషలలో మంచి ఆదరణ పొందుతాయి. ముఖ్యంగా కేరళలో అయితే అక్కడ ఉన్న టాప్ హీరోలకు మంచి పోటీ ఇస్తాడు బన్నీ. అల్లు అర్జున్ సినిమా రిలీజవుతుందంటే కేరళ లో ఉండే స్టార్ హీరోలు సైతం వెనక్కి తగ్గే పరిస్థితి. ఇదిలా ఉంటే ప్రస్తుతం సినిమా రంగంలో మాత్రమేకాక మల్టీప్లెక్స్ థియేటర్ బిజినెస్ లో అల్లు అర్జున్ అడుగు పెట్టడం తెలిసిందే.
అయితే ఈ మల్టీప్లెక్స్ బిజినెస్ మాత్రమే కాక ఎగ్జిబిషన్ బిజినెస్ లో కూడా బన్నీ అడుగు పెట్టనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో వార్తలు వినబడుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ నడిబొడ్డున అమీర్ పేట లో బన్నీ “AAA” పేరిట మల్టీప్లెక్స్.. నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కాంప్లెక్స్ లోనే అతిపెద్ద ఎగ్జిబిషన్ హాల్ … కూడా పెట్టడానికి అల్లుఅర్జున్ నిర్ణయించుకున్నట్లు, వచ్చే ఏడాది సంక్రాంతి కల్లా కంప్లీట్ చేయడానికి డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
మల్టీప్లెక్స్ బిజినెస్ లో ఇప్పటికే మహేష్ బాబు, విజయ్ దేవరకొండ అడుగు పెట్టడం జరిగింది. ఈ క్రమంలో తాజాగా బన్నీ అడుగుపెట్టడంతో ఈ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న “పుష్ప” సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 13వ తారీకు రిలీజ్ కానుంది. ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి. అల్లు అర్జున్ కెరీర్ లో డిఫరెంట్ మేకోవర్ సినిమాలు తీసిన డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న నేపథ్యంలో..అల్లు అర్జున్ ని గంధపు చెక్కల స్మగ్లర్ గా మాత్రమేకాక లారీ డ్రైవర్ పాత్రలో చూపిస్తున్న నేపథ్యంలో ..మాస్ ఆడియన్స్ ఈ సినిమా రిలీజ్ కోసం ఎంతగానో ఆతృతతో ఎదురు చూస్తున్నారు.