AP Cabinet : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ కేబినెట్ మంత్రి వర్గాన్ని సవరించబోతున్నట్లు వార్తలు ఊపందుకున్నాయి. 151 సీట్లు గెలిచిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సామాజిక కోణంలో కొంతమంది సీనియర్లకు మంత్రి పదవులు ఇవ్వలేకపోయారు. ముఖ్యంగా యువత పైనే కాన్సన్ట్రేట్ చేసిమ జగన్ బలమైన రెడ్డి… ఇతర సీనియర్ నేతలకు చోటు కల్పించలేదు. ఇక ఆయన మంత్రివర్గంలో 80% మంది ఎప్పుడో జగన్ కి భజన చేసే వారే. మిగిలిన వారిలో అసలు తమకు పదవులు దక్కుతాయని ఏ కోశానా ఆశ కూడా లేని నాయకులు కుల సమీకరణాలు ద్వారా మంత్రి పదవులను సంపాదించారు.
కానీ జగన్ తెలివిగా ప్రతి రెండు సంవత్సరాలకు మంత్రివర్గం సవరణ ఉంటుందని ముందే తెలియజేసిన విషయం తెలిసిందే. కాబట్టి ఇప్పుడు ఉన్న మంత్రుల భయం పట్టుకుంది. పంచాయతీ-మున్సిపల్ ఎన్నికల్లో పరిపూర్ణం విజయం సాధించిన తర్వాత జగన్ పాలనపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ రోజు కర్నూలు ఎయిర్పోర్ట్ ను ప్రారంభించి రాయలసీమ వాసుల కలల నెరవేర్చారు. ఇక తదుపరి చర్యగా మంత్రివర్గాన్ని విస్తరించేందుకు జగన్ రెడీ అవుతున్నట్లు అమరావతిలో చర్చ జరుగుతోంది. ఈ మధ్య మున్సిపాలిటీ పంచాయతీ ఎన్నికల్లో పెద్దఎత్తున కొంతమంది క్యాండిడేట్ల నుంచి డబ్బు గుంజిన రిపోర్టు సీఎం దగ్గర ఉందని సమాచారం.
బదిలీల పేరిట లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న వార్తలు కూడా వచ్చాయి. ఇలా అవినీతి మరకలు ఉన్న మంత్రులను ఇంటికి పంపించే ప్రక్రియ మొదలు కాబోతోందని చెబుతున్నారు. అయితే ఈ క్రమంలో పార్టీకి నష్టం జరగకుండా ఉండాలని జగన్ భావిస్తున్నారట. కర్ర విరగకుండా పాము చావకుండా జగన్ మంత్రివర్గం కూర్పు ఉండబోతోందని టాక్ నడుస్తోంది. కేబినెట్ విస్తరణ ఈ నెలలోనే మొదలుపెట్టి ఆగస్టు వరకు కొనసాగించి తర్వాత రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజల వద్ద సమాచారం తీసుకోవాలని జగన్ భావిస్తున్నారట. మరి రాబోయే రోజుల్లో వైసీపీ లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూడాలి.