బన్ని, త్రివిక్రమ్ కలయికలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం ఓ షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. తదుపరి షెడ్యూల్ ఈద్ సందర్భంగా నేడు హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్లో హీరోయిన్ పూజా హెగ్డే యూనిట్తో జాయిన్ అవుతుంది. `ఓ గొప్ప టీంతో కలిసి పనిచేస్తున్నాను. ఎంటర్ టైనింగ్ మూవీ` అంటూ పూజా హెగ్డే తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. అల్లు అరవింద్, రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత బన్ని, త్రివిక్రమ్ కలయికలో రూపొందుతోన్న హ్యాట్రిక్ చిత్రమిది. టబు, బొమన్ ఇరాని తదితరులు నటిస్తున్నారు. కేతికా శర్మ కూడా మరో హీరోయిన్గా నటించనుంది. వచ్చే సంక్రాంతికి సినిమాను విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
previous post
next post