Anasuya Bharadwaj: అనసూయ భరధ్వాజ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. బుల్లితెరపై హాట్ యాంకర్గా సత్తా చాటుతున్న ఈ ముద్దుగుమ్మ.. వెండితెరపై సైతం స్టార్ హీరోల సినిమాల్లో అదిరిపోయే ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండే అనసూయ.. ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫొటో షూట్లతో అలరిస్తుంటుంది.
అయితే నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అనసూయ ట్విట్టర్ వేదికగా ఓ వివాదాస్పదమైన ట్వీట్ చేసి నెటిజన్ల చేతిల్లో అడ్డంగా బుక్కైంది. `ఓ.. ! ప్రతీ ట్రోలర్, మీమ్ మేకర్ హఠాత్తుగా ఈ రోజు మహిళలను గౌరవిస్తున్నారు. ఈ గౌరవం 24 గంటల్లో ముగుస్తుంది. కాబట్టి మహిళలందరికి హ్యాపీ ఫూల్స్ డే` అంటూ ట్వీట్ చేసింది.
దీంతో ఆమె ట్వీట్పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. `ఇవే తగ్గించుకుంటే మంచిది`, `మనం చేసే పనుల ద్వారానే మనకు గౌరవం దక్కుతుంది`, `ఈ రోజు కూడా ఇలాంటి ట్వీట్ అవసరమా` అంటూ ఓ రేంజ్లో ఆమెను ఏకేస్తున్నారు. అయితే తనపై జరుగుతున్న ట్రోల్స్ను గమనించిన అనసూయ.. గుమ్మడి కాయ దొంగలు వచ్చారు.. నా ట్వీట్ కింద కామెంట్లు చేస్తున్నారు అంటూ మరో పోస్ట్ పెట్టింది.
అయినా ఆమెను వదిలిపెట్టలేదు. రకరకాల కామెంట్లతో అనసూయను వేరె లెవల్లో ఆడుకుంటున్నారు. కాగా, సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల పుష్ప, ఖిలాడి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ భామ ప్రస్తుతం రంగ మార్తాండ, పక్కా కమర్షియల్, పుష్ప 2, గ్రహమ్ తదితర చిత్రాల్లో నటిస్తోంది.
Annnddd!! Thank me later!! You will see all those “gummadikaya dongalu” commenting below my tweet!! Have a good one y’all!! 😉
— Anasuya Bharadwaj (@anusuyakhasba) March 8, 2022