Alia Bhatt Deepfake: దేశంలో డీప్ ఫేక్ వీడియోలు సెలబ్రిటీల జీవితాలను కుదిపేస్తున్నాయి. రోజురోజుకీ పెరుగుతున్న టెక్నాలజీ దానికి సంబంధించిన పరిణామాలు.. చాలా దుష్ఫలితాలు తీసుకొస్తున్నాయి. ఓ రకంగా టెక్నాలజీ సమయాన్ని ఆదా చేస్తున్న మరి కొన్ని విషయాలలో.. జీవితాలను గజిబిజిగా మారుస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చాక సెలబ్రిటీల జీవితాలు.. చాలా వరకు ప్రమాదంలో పడ్డాయని చెప్పవచ్చు. రకరకాల ఫేక్ వార్తలు ఇంకా.. బతికున్నా చనిపోయారని.. ప్రచారాలు చాలామంది జీవితాలలో చోటుచేసుకున్నాయి. కాగా ఇప్పుడు డీప్ ఫేక్ వీడియో టెక్నాలజీ వచ్చాక పరిస్థితి మరింతగా దిగజారిపోయింది.
ఎవరో వీడియోలలో సెలబ్రిటీల ఫేస్ లను అప్ లోడ్ చేసేసి.. అగంతకులు వదులుతున్న వీడియోలు.. ఇంటర్నెట్ నీ కుదిపేస్తున్నాయి. హీరోయిన్లను బోల్డ్ గా చూపించే ప్రయత్నంలో భాగంగా… ఒరిజినల్ వీడియోకి సెలబ్రిటీల ముఖములను జోడించి చేస్తున్న వీడియోలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇప్పటికే రష్మిక ఇంకా కాజోల్ ఫేక్ టెక్నాలజీ బారిన పడ్డారు. వాళ్ల వీడియోలు పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత కూడా రావటం జరిగింది. తాజాగా ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ డీప్ ఫేక్ బారిన పడటం జరిగింది. ఈమె వీడియోలో ఒరిజినల్ ఎవరిదన్న విషయం ఇంకా తెలియలేదు. ఆమెను చాలా బోల్డ్ గా చూపించే ప్రయత్నం.. చేశారు. దీంతో సెలబ్రిటీల పరిస్థితే ఇలా ఉంటే తమ పరిస్థితి ఏమిటని.. డీప్ ఫేక్ వీడియో టెక్నాలజీ పై సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.
ఇదే సమయంలో మరొక డీప్ ఫేక్ వీడియోలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ విషయంలో కేంద్రం కూడా సీరియస్ గా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. రష్మిక డీప్ ఫేక్ వీడియో వచ్చిన సమయంలో అమితాబ్, చిరంజీవి, నాగచైతన్య, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, ఎమ్మెల్సీ కవిత ఇంకా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు స్పందించారు. ఆ సమయంలోనే కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ ఇలాంటి వీడియోలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కానీ రష్మిక డీప్ ఫేక్ వీడియోలు వచ్చిన తర్వాత.. కాజోల్ వీడియో కూడా రావడం జరిగింది. కాగా ఇప్పుడు.. అలియా భట్ వీడియో రావటం సంచలనంగా మారింది.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!