Chiru NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో నందమూరి ఫ్యాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ అనే పోటీ ఉండేది. చిరంజీవి, బాలకృష్ణ సినిమాలకు అభిమానులు పోటాపోటీగా బ్యానర్లు కట్టే వాళ్ళు. చాలా ప్రతిష్టాత్మకంగా తమ అభిమాన హీరోల సినిమాలను తీసుకుని.. రచ్చ రచ్చ చేసేవాళ్ళు. ఈ క్రమంలో ఎవరి సినిమా అయినా ఫ్లాప్ అయితే మిగతా అభిమానులు తెగ ఏడిపించే వాళ్ళు. అదే సమయంలో హిట్టయితే భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చేలా అభిమానులు ప్రముఖ పాత్ర పోషించే వాళ్లు. అటువంటి పరిస్థితి నందమూరి మెగా ఫ్యాన్స్ మధ్య గతంలో ఉండగా..RRR సినిమా మొదలయ్యాక … మెగా నందమూరి ఫ్యాన్స్ చాలా వరకు కలిసిపోయారు.
“RRR” ప్రీ రిలీజ్ ఈవెంట్ లలో చరణ్ చాలా మెచ్యూర్ గా మాట్లాడుతూ తారక్ పెర్ఫామెన్స్ గురించి పొగడటం.., ఇక ఇదే సమయంలో తారక్ కూడా చరణ్ నటన గురించి పొగుడుతూ ఇద్దరూ ఒకరిపై మరొకరు ప్రశంసలు కురు పెంచుకుంటూ.. ఎప్పుడూ ఇదే బాండింగ్ జీవితాంతం ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి తో ఏకంగా వేదిక పంచుకోవటానికి ఎన్టీఆర్ రెడీ అయినట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీ లో వైరల్ అవుతుంది.
విషయంలోకి వెళితే కన్నడ స్టార్ హీరో దివంగత పునీత్ రాజ్ కుమార్ నటించిన… చివరి చిత్రం “జేమ్స్” మార్చి 7వ తారీఖున పాన్ ఇండియా నేపథ్యంలో విడుదల కానుంది. కన్నడం తెలుగు తమిళం మలయాళం హిందీ భాషల్లో విడుదల అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్… మార్చ్ ఆరో తారీకు చాలా గ్రాండ్ గా సినిమా యూనిట్ ప్లాన్ చేసింది. ఈ సందర్భంగా తెలుగు భాష తరపున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిరంజీవి మరియు జూనియర్ ఎన్టీఆర్ లని చిత్ర బృందం ఆహ్వానించారని సమాచారం. చిరంజీవి అదేవిధంగా తారక తో పునీత్ రాజ్ కుమార్ కి మంచి అనుబంధం ఉండటంతో “జేమ్స్” సినిమా యూనిట్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!