Bigg Boss Non Stop: బిగ్బాస్ ఓటీటీ శనివారం సాయంత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అంగరంగ వైభవంగా స్టార్ట్ అయింది. మరోసారి నాగార్జుననే హోస్ట్ గా చేస్తూ ఉన్నారు. ఎనభై నాలుగు రోజుల పాటు నిరంతరంగా ప్రసారం కానుంది. షో ప్రారంభం సమయంలో ఇంటి మొత్తాన్ని చూపించిన నాగార్జున ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ లను ఆహ్వానించడం జరిగింది. మొత్తం 17 మంది కంటెస్టెంట్ లు ఎంట్రీ ఇవ్వగా.. అందులో ఎనిమిది మంది అబ్బాయిలు కాగా తొమ్మిది మంది అమ్మాయిలు.
హౌస్ లో ఎంట్రీ ఇచ్చినా కంటెస్టెంట్ ల లిస్ట్.. అషు రెడ్డి, మహేష్ విట్టా, ముమైత్ ఖాన్, అజయ్, యాంకర్ స్రవంతి, ఆర్జే చైతు, అరియానా, నటరాజ్ మాస్టర్, శ్రీ రాపాక, అనిల్ రాథోడ్, మిత్రశర్మ, తేజస్వి, సరయు, యాంకర్ శివ, బిందు మాధవి, హమీద, అఖిల్ సర్ధక్. దాదాపూర్ వీళ్లల్లో కొంతమంది అంతకుముందే బిగ్ బాస్ హౌస్ లో రాణించిన వాళ్ళు ఉన్నారు కొత్తగా మరికొంతమంది రావడం జరిగింది.
డిస్నీ హాట్ స్టార్ లో మొదటి సారి నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ తరహాలో రూపొందుతున్న ఈ షో ఏవిధంగా అలరిస్తుందో చూడాలి. ఇక ఇదే సమయంలో ఐపీఎల్ టోర్నీ కూడా స్టార్ట్ కావటంతో పాటు మరోపక్క బయట థియేటర్లు కరోనా ఆంక్షలు లేకుండా నడుస్తూ ఉండటం తో… ఏ విధంగా..బిగ్ బాస్ ఓటిటీ వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. ఇందులో దాదాపు చాలా వరకు తెలిసిన ముఖాలు కావడంతో.. పాటు 8 మంది గతంలో ఆడిన వాళ్ళు ఉండటంతో.. ఓటిటీ కాన్సెప్ట్… విషయంలో బిగ్ బాస్ ఆడియన్స్ కూడా కొత్తగా ఫీల్ అవుతున్నారు. కచ్చితంగా హౌస్ లో మంచి పోటా పోటీ వాతావరణం ఉంటుందని చెప్పుకొస్తున్నారు.