Devatha Serial: మాధవ్ రాధ దగ్గరికి వెళ్లి ఆదిత్య తో జరిగిన గొడవ అంత చెబుతాడు. నువ్వు నాకు ఒక సహాయం చేయాలి రాధా.. పిల్లలు నానుండి దూరం కాకుండా నువ్వే ఏదో ఒకటి చెయ్.. ఆదిత్య తో పిల్లలు మాట్లాడకుండా చెయ్యమని రాధను అడుగుతాడు. నువ్వు చెప్తే పిల్లలు వింటారని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు..
దేవి, చిన్మయి రాధ దగ్గరకు వచ్చి గుడిలో వాళ్ళ నాన్న చేసిన గొడవ గురించి చెబుతారు. ఇదంతా మీరు ఆఫీసర్ సార్ దగ్గరికి వెళ్లడం వల్లే జరిగింది కదా వద్దు అని చెబుతుంది. నాన్న గొడవ చేస్తే మమ్మల్ని వెళ్ళద్దు అంటావేంటి అని పిల్లలు అంటారు. నాన్నను అనకుండా మమ్మల్ని వెళ్ళాద్దు అంతవెంటి. నాన్న కు ఎందుకు కోపం వచ్చింది. మీరు వెళ్ళబట్టే కదా అని రాధ బదులిస్తుంది. ఇక ఆఫీసర్ సార్ దగ్గరికి వెళ్తాను అంటే నాతో కూడా మాట్లాడకండి అని రాధా తేల్చి చెప్పేస్తుంది. దానికు పిల్లలు అలిగి పడుకుంటారు. ఇక తెల్లారి పిల్లల్నీ స్కూల్ కి మాధవ్ తీసుకువెళ్లి దింపుతాడు. పక్కనే ఉన్న ఆదిత్య మాధవ్ వెళ్లిపోయిన తర్వాత దేవి అని పిలుస్తాడు. ఆఫీసర్ సార్ అని పిలిచి దేవి దగ్గరకు రాకుండా ఆగిపోతుంది. స్కూల్ లోకి వెళ్లి పోతుంది. ఏమైందని పిల్లలు మాట్లాడకుండా స్కూల్ లోకి వెళ్లారు అని అనుకుంటాడు.
ఆదిత్య మనసులో ఎందుకు నాతో మాట్లాడటం లేదు.. ఏమైంది అని మనసులో అనుకుంటూ ఉండగా మాధవ్ వస్తాడు. ఇప్పుడే కాదు ఇంకా ఎప్పుడు పిల్లలు నీతో మాట్లాడరు. ఏం చేసావ్ అని అడగగా నేను ఏమి చేయాలా.. ఎవరు చెబితే ఏం చేస్తే వింటారో వాళ్లతోనే అలా చేసేలా చేశాను అని అంటాడు. అయితే కచ్చితంగా రాధ తోనే ఏదో చేయించడానికి తెలుసుకున్న ఆదిత్య.. దేవిని తనతో మాట్లాడటానికి ఏం చెప్పి రాధను ఒప్పిస్తాడో తరువాయి భాగంలో చూద్దాం.