Dhanush: కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్, ఐశ్వర్యలు విడిపోయిన సంగతి తెలిసిందే. రెండేళ్ల పాటు రహస్యంగా ప్రేమించుకున్న ఈ జంట 2004లో పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. అప్పటికి కేవలం మూడు సినిమాలే చేసిన ధనుష్.. స్టార్ ఇమేజ్ కోసమే తనకంటే వయసులో రెండేళ్లు పెద్దైన ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడని ప్రచారం జరిగింది.
కానీ, ధనుష్ ఎప్పుడూ తన సినిమాలకు రజినీకాంత్ క్రేజ్ను వాడుకోలేదు. తన సహజ నటనతో అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. మరోవైపు మంచి ఫ్యామిలీ మ్యాన్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు. కానీ, అనూహ్యంగా ధనుష్, ఐశ్వర్యలు తమ వైవాహిక బంధానికి ముగింపు పలికారు.
పెళ్లైన 18 ఏళ్లకు వీరు విడిపోవడం అందరినీ షాక్కి గురి చేసింది. ఇకపోతే ఈ దంపతులకు యాత్ర, లింగా అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే వీరిలో యాత్ర అచ్చు గుద్దినట్టు ధనుష్లానే ఉంటాడు. కుమారిడి ఫొటోను ధనుష్ తాజాగా ఇన్స్టా వేదికగా షేర్ చేశాడు. ప్రస్తుతం ఆయన `నానే వరువెన్` సినిమా షూటింగ్ నిమిత్తం ఊటీలో ఉన్నాడు.
అయితే షూటింగ్ బ్రేక్లో యాత్రతో కలిసి ధనుష్ టైమ్ స్పెండ్ చేశాడు. ఆ సమయంలో తీసిన ఓ పిక్ను ధనుష్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా.. అది కాస్త నెట్టింట వైరల్గా మారింది. ఇక ఈ పిక్ను చూసిన నెటిజన్లు.. `ధనుష్కు యాత్ర కార్బన్ కాపీలా ఉన్నాడు, మీరుద్దరు ధనుష్ ఎవరు? అంటూ కామెంట్స్ చేస్తున్నాడు. ఏదేమైనప్పటికీ ధనుష్ దాంపత్య జీవితానికి ఎండ్ కార్డు వేసినా తన తండ్రి స్థానాన్ని మాత్రం మారువడం లేదు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!