సినీ దర్శకురాలు నందిని రెడ్డి.. ‘ఓ బేబీ’ సినిమాతో మళ్లీ గాడిలో పడ్డారు. సమంత హీరోయిన్గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. సినీ అభిమానులతో పాటు ఇండస్ట్రీ పెద్దలు ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. కెరీర్లో హిట్ అండ్ ఫ్లాప్స్తో సతమతమైన ఈ యువ దర్శకురాలికి మళ్లీ అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఓ కొత్త ప్రాజెక్టుకు అగ్రీమెంట్ కుదుర్చుకున్నారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మాణంలో ఓ సినిమా చేయబోతున్నారు. సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ ఈ సినిమాలో నటిస్తున్నారు. నందిని చెప్పిన కథ నచ్చిన ఈ మెగా హీరో.. వెంటనే ఒప్పుకున్నారట. ప్రస్తుతం ‘ఉప్పెన’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న వైష్ణవ్.. అది పూర్తి అవ్వగానే ఈ సినిమా చేయనున్నారని సమాచారం.
ఇదిలా ఉంటే.. నందిని రెడ్డి చేతిలో మరిన్ని ప్రాజెక్టులు ఉన్నాయని తెలుస్తోంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ చేసేందుకు ఆమె రెడీ అవుతున్నారు. లస్ట్ స్టోరీస్ తెలుగు రిమేక్లో ఓ సీజన్కు నందిని రెడ్డి దర్శకత్వం వహించనున్నారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!