Pushpa: గరికిపాటి నరసింహారావు పుష్ప సినిమాపై ఫుల్ ఫైర్ అయ్యారు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని చోట్ల విజయం సాధించింది. ముఖ్యంగా శ్రీవల్లి పాటలు అల్లు అర్జున్ వేసిన స్టెప్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. తగ్గేదేలే అనే డైలాగ్ కూడా చాలా మంది సినిమా సెలబ్రిటీలు మరియు ఇంటర్నేషనల్ క్రికెటర్లు చెబుతున్నారు. సోషల్ మీడియాలో వీడియో లు చేస్తూ కూడా పోస్ట్ చేస్తున్నారు. ఒక పక్క పరిస్థితి ఇలా ఉంటే మరో పక్క తెలుగు సాహితి ప్రవచనకర్త మహా సహస్రావధాని పద్మశ్రీ అవార్డు గ్రహీత గరికపాటి నరసింహారావు… స్మగ్లర్ నీ హీరోగా చిత్రీకరించి సమాజానికి ఏ సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారో హీరో మరియు డైరెక్టర్ సమాధానం చెప్పాలని నిలదీశారు.
ఇటువంటి దారుణమైన సినిమాలు చేసి పైగా సినిమాల్లో వెలుతురు తింటది ఆకు…ఆకును తింటది మేక.. మేకను తింటది పులి, పులి తింటది .. ఇది కదరా ఆకలి.. పులినే తింటది చావు.. చావును తింటది కాలం.. కాలాన్ని తింటది కాళి.. ఇది మహా ఆకలి.. వేటాడేది ఒకటి.. పరిగెత్తేది ఇంకొకటి.. అంటూ ఈ సృష్టిలో ఏది తప్పు కాదన్నట్టు చూపించాడు దర్శకుడు సుకుమార్. మొత్తం సినిమాలో అంతా చెడు చూపించి చివరి 5 నిమిషాల్లో మంచి చూపిస్తాం.
పుష్ప సెకండ్ పార్ట్ తీస్తాం, .. నువ్వు తీసేలోపే సమాజం చెడిపోవాలా.. ? స్మగ్లింగ్ చేసేవాడు.. ఏదో ఘనకార్యం చేసినట్టు తగ్గేదేలే అంటాడా ? ఇపుడిది ఉపనిషత్ సూక్తి అయింది. ఈ డైలాగుతో సమాజంలో నేరాలు, ఘోరాలు పెరుగుతున్నాయి. దీనిపై హీరో, డైరెక్టర్ను సమాధానం చెప్పమనండి అంటూ గరికపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా ప్రస్తుత సమాజంలో హీరో ని నెగిటివ్ గానే చూపిస్తే ఆడియన్స్ ఎక్కువ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఒక్క ఈనాటి కాలంలో కాదు ఎన్టీఆర్ అదేవిధంగా నాగేశ్వరరావు హీరోగా ఉన్న నాటి నుండి… కథలో హీరో ని దొంగగా లేదా డాన్ పాత్రలో చూపిస్తే ప్రజలు ఆదరిస్తున్నారు .అందుకే… ఇటువంటి సినిమా తీశామని వాళ్లే చెబుతున్నారు. మరి ఇలాంటి వ్యాఖ్యలు గరికిపాటి చేయటం తో… పుష్ప టీం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!