గోపీచంద్ కథానాయకుడిగా సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. గౌతమ్ నంద, పంతం సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో రానున్న హ్యాట్రిక్ చిత్రమిది. మిల్కీబ్యూటీ తమన్నా కథానాయిక. బెంగాల్ టైగర్, రచ్చ తర్వాత సంపత్ నంది దర్శకత్వంలో తమన్నా చేస్తోన్న చిత్రమిది. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజా సమాచారం మేరకు ఈ సినిమాకు `సీటీమార్` అనే టైటిల్ పరిశీలనలో ఉంది. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో గోపీచంద్ ఆంధ్ర కబడ్డీ జట్టు కెప్టెన్గా నటిస్తుంటే.. తెలంగాణ కబడ్డీ జట్టు కెప్టెన్గా తమన్నా కనిపించనున్నారు. దిగంగన సూర్యవంశీ కీలక పాత్రలో నటిస్తుంది. శ్రీనివాస్ చిట్టూరి నిర్మాత.
previous post
next post
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!