అమరావతి: రాజధాని రైతులపై అక్రమ కేసులు పెట్టిన పోలీసులపై మంగళగిరి జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాపై దాడి చేశారన్న అభియోగంతో రాజధాని ప్రాంతానికి చెందిన కొందరు రైతులు పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సోమవారం న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై న్యాయమూర్తి సీరియస్ అయ్యారు. ‘రైతులను ఏ కారణంతో అరెస్ట్ చేసారు? కత్తులు ఎక్కడ? ఎవరైనా ఐసీయూలో ఉన్నారా? వీరి నుండి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు ఏవి?’ అని వర్షం కురిపించారు. జడ్జి కోపానికి, ఆమె అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కిమ్మనకుండిపోయారు. అరెస్టు అయిన రైతులందరికీ బెయిల్ మంజూరు చేసి.. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం పోలీసులను కావొద్దని హెచ్చరించారు. దీంతో రైతులంతా మధ్యాహ్నానికి విడుదల కానున్నారు.
కాగా, ఏపీ రాజధానిని తరలించడాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు ఆందోనళలు, నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆదివారం(డిసెంబర్ 29) తెల్లవారుజామున పలువురు రైతుల ఇళ్లల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. మీడియాపై దాడి చేశారన్న అభియోగంతో ఏడుగురు రైతులను అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. వారిపై పలు కేసులు నమోదు చేసి 14 రోజుల పాటు రిమాండ్ కూడా విధించిన సంగతి తెలిసిందే.