Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల భార్య సురేఖతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లడం జరిగింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఫోటో ద్వారా పంచుకున్నారు. ఈ క్రమంలో అమెరికాలో చాలామంది తెలుగు వాళ్ళు చిరంజీవికి తాజాగా సన్మానం చేయడం జరిగింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ అవార్డు చిరంజీవికి ప్రకటించడం తెలిసింది. ఈ సందర్భంగా లాస్ ఏంజెల్స్ లో తెలుగువారు చిరంజీవిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించినప్పుడు ఎంతో ఆనందం కలిగింది. నాకంటే ఎక్కువగా మీరు సంతోషపడుతున్నారు.
ఇంతకు మించిన అవార్డు ఏముంటుంది. నాపై మీరు చూపిస్తున్న అభిమానం వెలకట్టలేనిది.. అని చిరంజీవి భావోద్వేగంగా మాట్లాడారు. ప్రస్తుతం “విశ్వంభర” సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ ఆల్రెడీ ఒక షెడ్యూల్ కంప్లీట్ కావడం జరిగింది. చిరంజీవి కెరియర్ లోనే అత్యంత బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష నటిస్తోంది. యువి క్రియేషన్స్ నిర్మాణ సంస్థ.. ఈ సినిమాని నిర్మిస్తోంది. బింబిసారా దర్శకుడు వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతమందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ చేయబోతున్నారు.
ఈ సినిమా కోసం చిరంజీవి ప్రత్యేకంగా వర్కర్స్ చేయడంతో పాటు చాలా సన్నగా కూడా అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. “జగదేకవీరుడు అతిలోకసుందరి” సినిమా తరహాలో “విశ్వంభర” స్టోరీ ఉండబోతున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్స్ గ్రాఫిక్స్ కి దర్శకుడు పెద్దపీట వేసినట్లు సమాచారం. అమెరికా నుండి వచ్చిన వెంటనే చిరంజీవి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్లో పాల్గొనబోతున్నారు. కాగా మార్చి లేదా ఏప్రిల్ నెలలో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ విభూషణ్ అవార్డు అందుకోనున్నారు.
"Padma Vibhushan", Dr. Mega star @KChiruTweets in Los Angeles, being felicitated by USA Mega fans. ♥️#PadmaVibhushanChiranjeevi #MegastarChiranjeevi #PeoplesPadma #PadmaAwards2024 pic.twitter.com/LdsDxYTDqG
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) February 19, 2024
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!