Pooja Hegde: బుట్ట బొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2012వ సంవత్సరంలో తమిళంలో హీరోయిన్ గా నటించిన పూజా హెగ్డే 2014లో “ముకుంద” సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ తర్వాత “ఒక లైలా కోసం” సినిమాతో మొదటి హిట్ అందుకోవటం జరిగింది. అనంతరం వరుస పెట్టి హిట్లు పూజా హెగ్డే ఖాతాలో పడ్డాయి. దీంతో చాలామంది దర్శకులకు నిర్మాతలకు లక్కీ హీరోయిన్ అయిపోయింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్.. మరి కొంతమంది టాప్ మోస్ట్ హీరోలతో నటించడం జరిగింది. కరోనా రాకముందు వరుస పెట్టి విజయాలు అందుకున్న పూజ హెగ్డే.. కరోనా తర్వాత ఆమె నటించిన చాలా సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.
అంతేకాకుండా త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన “గుంటూరు కారం” సినిమా నుండి మధ్యలోనే పూజా హెగ్డే వెళ్లిపోవడం జరిగింది. ప్రస్తుతం పూజ హెగ్డేకి సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో.. ఒక్క సినిమా కూడా లేదు. ప్రస్తుతం నార్త్ లో అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంది. అంతకుముందు సల్మాన్ ఖాన్ సినిమా చేయడం జరిగింది. దీంతో ఇంకా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న పూజా హెగ్డే పై బాలీవుడ్ మీడియా తాజాగా సరికొత్త కథనాలు ప్రసారాలు చేస్తూ ఉన్నాయి. విషయంలోకి వెళ్తే పూజా హెగ్డే ప్రేమలో పడినట్లు వార్తలు బీ టౌన్ లో వినిపిస్తున్నాయి. అతను క్రికెటర్ అని పీకల్లోతు ప్రేమలో ఇద్దరు ఉన్నట్లు ప్రచారం చేస్తూ ఉన్నారు.
అంతేకాదు సదరు క్రికెటర్ ప్రస్తుతం ఇండియన్ టీంలో కూడా ఆడుతున్నట్లు వరల్డ్ కప్ టోర్నమెంట్ అయిన వెంటనే హీరోయిన్ పూజ పెళ్లి చేసుకోబోతున్నట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి. ప్రస్తుతం ముంబై మీడియాలో ఇది హాట్ టాపిక్ గా మారింది. క్రికెటర్ తో పూజ ప్రేమలో ఉందని త్వరలో బుట్ట బొమ్మ పెళ్లి చేసుకోబోతుందని వస్తున్నా వార్తలు సంచలనంగా మారాయి. అయితే ఇంతకీ పూజాతో ప్రేమలో ఉన్న క్రికెటర్ ఎవరు అనేది మాత్రం బాలీవుడ్ మీడియా చెప్పలేదు.