Unstoppable 2: నటసింహం నందమూరి బాలయ్య బాబు హోస్ట్ గా ఆహా ఓటిటిలో “అన్ స్టాపబుల్ 2″షో స్ట్రీమ్ అవుతున్న సంగతి తెలిసిందే. హోస్ట్ గా బాలకృష్ణ దుమ్ము దులుపుతున్నాడు. కుర్ర హీరోలు వస్తే వాళ్లతో కామెడీ పండిస్తూ షో మరింత ఎంటర్టైన్మెంట్ ఉండే రీతిలో రక్తి కట్టిస్తున్నాడు. అదిరిపోయే పంచ్ డైలాగులతో పాటు… వచ్చే అతిధుల వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ప్రశ్నలు వేస్తూ… షోపై ఇంట్రెస్ట్ కలిగించే రీతిలో అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నాడు. ఒకపక్క సీరియస్ మరోపక్క ఎంటర్టైన్మెంట్ ఇదే సమయంలో ఆటలు కూడా ఆడిస్తూ బాలయ్య చిన్నపిల్లోడిలాగా.. షోలో చేసే అల్లరి చూసే ప్రేక్షకులకు … ఇంట్రెస్ట్ కలిగిస్తూ ఉంది.
ఒక్కో సందర్భంలో వచ్చే అతిధులను ఇరుక్కున పెట్టే రీతిలో కూడా ప్రశ్నలు అడుగుతున్నారు. మొదటి సీజన్ లో చాలామంది ఇండస్ట్రీకి చెందిన వాళ్లే రావటం జరిగింది. కానీ రెండో సీజన్ లో ఒకపక్క ఇండస్ట్రీ ప్రముఖులు మరోపక్క రాజకీయ నేతలు కూడా వస్తూ ఉన్నారు. ఇప్పటికే చంద్రబాబు ఇంకా నారా లోకేష్ వచ్చారు. తాజాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డి, నటి రాధిక రావటం జరిగింది. ఈ ఎపిసోడ్ నవంబర్ 28వ తారీకు స్ట్రీమ్ చేస్తున్నట్లు ఆహా ప్రోమో రిలీజ్ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే బాలకృష్ణ, కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డి ఒకే కాలేజీలో చదవటం జరిగింది. ఈ సందర్భంగా వారు కాలేజీ ముచ్చట్లు ప్రోమోలో చూపించారు.
షోలో భాగంగా… దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రస్తావన రావటంతో… బాలయ్య బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. మేటర్ లోకి వెళ్తే బతికి ఉండబట్టే ముఖ్యమంత్రి కాగలిగాను అని కిరణ్ కుమార్ రెడ్డి తన సీఎం పదవి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి దగ్గరగా ఉండే ఒక మంత్రి ఆయనను తప్పుదోవ పట్టించేవారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతరం బాలయ్య అందుకుని, మనం గొప్ప నేతలను, వ్యక్తులను కోల్పోయామని, అలాంటివారిలో రాజశేఖర్ రెడ్డి ఒకరని .. పొగడటం జరిగింది. వైయస్సార్ లెజెండరీ పర్సనాలిటీ అంటూ బాలయ్య అన్ స్టాపబుల్ షోలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!