Janhvi Kapoor: దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ సౌత్ లో ఎన్టీఆర్ తో చేస్తున్న “దేవర” సినిమాతో ఎంట్రీ ఇస్తుంది. దక్షిణాది సినిమా రంగంలో దివంగత శ్రీదేవికి ఎటువంటి ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రామారావు మొదలుకొని చిరంజీవి తరం వరకు చాలామంది టాపిక్ హీరోలతో ఆమె నటించింది. బోనికపూర్ తో పెళ్లయిన తర్వాత సినిమాలకు దూరమైంది. దురదృష్టవశాత్తు 2017 లో దుబాయిలో బాత్రూంలో మరణించడం జరిగింది. ఇదిలా ఉంటే ఆమె వారసురాలిగా జాన్వీ కపూర్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తొలుత హిందీలో కెరియర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ అక్కడ పరవాలేదు అనిపించుకుంది.
హిందీలో చేస్తున్న సమయంలోనే జాన్వీనీ సౌత్ లోకి తీసుకురావడానికి చాలామంది దర్శకులు నిర్మాతలు ప్రయత్నాలు చేశారు. కానీ అప్పట్లో ఆమె సౌత్ సినిమాలు ఒప్పుకోలేదు. కానీ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా సౌత్ ఫిలిమ్ ఇండస్ట్రీ సినిమాలు సత్తా చాటుతో ఉండటంతో ఇప్పుడు ఆమె తెలివిగా తారక్ తో “దేవర” సినిమా ఒప్పుకుంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. అనంతరం బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటించే సినిమాలో ఛాన్స్ అందుకుంది. కాగా ఇప్పుడు అల్లు అర్జున్ తో మూడో ఛాన్స్ అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
విషయంలోకి వెళ్తే ప్రస్తుతం బన్నీ “పుష్ప” సెకండ్ పార్ట్ షూటింగులో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం చాలామంది హీరోయిన్లను సంప్రదించడం జరిగిందట. చివర ఆఖరికి జాన్వీ కపూర్ నీ ఫైనల్ చేసినట్లు సమాచారం. “పుష్ప” మొదటి భాగంలో ఐటెం సాంగ్ “ఊ అంటావా మామ” అనే సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయింది. సమంత మరియు అల్లు అర్జున్ వేసిన స్టెప్పులు అందరిని ఆకట్టుకున్నాయి. ఇప్పుడు అదే రీతిలో “పుష్ప” సెకండ్ పార్ట్ కి దేవిశ్రీప్రసాద్ ఐటెం సాంగ్ ఇచ్చినట్లు సమాచారం. “పుష్ప” సీక్వెల్ లో కూడా ఇప్పుడు అదే తరహాలో సాంగ్ ఇవ్వటం జరిగిందట. ఈ సాంగ్ కోసం ప్రత్యేకంగా జాన్వీ కపూర్ నీ “పుష్ప” మేకర్స్ తీసుకున్నట్లు టాక్.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!