`కామసూత్ర త్రీడీ` నటి సైరాఖాన్ గుండెపోటుతో కన్నుమూశారు. 2013లో విడుదలైన `కామసూత్ర త్రీడీ`లో ఆమె షెర్లిన్ చోప్రాను రీప్లేస్ చేసిన సంగతి తెలిసిందే. `కామసూత్రత్రీడీ`ని 2013లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో తొలుత ప్రదర్శించారు. ఆ సినిమా తర్వాత సైరాఖాన్ సినిమాలు కూడా చేయలేదు. ఆమె మరణవార్త విని `కామసూత్ర త్రీడీ` దర్శకుడు రూపేష్ పాల్ షాక్ అయ్యారు. ఆమె మరణవార్త ఎక్కడా పత్రికల్లో రాకపోవడం షాకింగ్గా అనిపించిందిందని అన్నారు. ఆమె గొప్ప నటి అని కొనియాడారు. ఎందుకో తగిన గుర్తింపు దక్కలేదని అన్నారు. `కామసూత్ర త్రీడీ`లో బోల్డ్ గా నటించడానికి ఆమెను చాలా కన్విన్స్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. సనాతన ముస్లిం కుటుంబానికి చెందిన ఆమె ఆ పాత్రను అంగీకరించడానికి అప్పట్లో చాలా తటపటాయించారనీ, అలాంటి బోల్డ్ సబ్జెక్ట్ ను అంగీకరించి చేయడం చాలా గొప్ప విషయమని ఆయన తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని చెప్పారు.
previous post
next post
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!