Keerthy Suresh: కీర్తి సురేష్.. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `నేను శైలజ` మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళ ముద్దుగుమ్మ.. తనదైన టాలెంట్తో అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది.
ప్రస్తుతం ఈ భామ మహేష్ బాబుకు జోడీగా `సర్కారు వారి పాట` సినిమా చేస్తోంది. పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట కలిసి నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సమ్మర్ కానుకగా మే 12న విడుదల కానుంది.
అలాగే కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలుగా `భోళా శంకర్` మూవీలోనూ నటిస్తోంది. తమిళ సూపర్ హిట్ `వేదాళం`కు రీమేక్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. వీటితో పాటు మలయాళ, తమళ్ చిత్రాలు కూడా కీర్తి సురేష్ చేతిలో ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్గా ఉండే కీర్తి సురేష్ తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేయగా.. వాటి చూసి నెటిజన్లు చూపు తిప్పుకోలేకపోతున్నారు. అంత అద్భుతంగా కీర్తి కనిపిస్తోంది.
చిలకపచ్చ చీర ధరించి అందంగా ముస్తాబైన ఆమె.. వింటేజ్ లుక్లో మెరిసిపోతూ నెటిజన్లను విపరీతంగా ఎట్రాక్ట్ చేసింది. మొత్తానికి కీర్తి సురేష్ తాజాగా పిక్స్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!