Kumkuma Puvvu : అంజలి గుడిలో నుండి బయటికి వెళ్లి పోతుంది. అమృతవాళ్ళు అరుణ్ కుమార్ వాళ్ళు గుడి అంతా వెతుకుతారు కానీ అంజలి ఎక్కడ కనిపించదు.అమృత ఎంత వెతికిన మాకు కనిపించలేదు వదిన మీకు ఏమైనా కనిపించిందా అని కావేరి అని అడుగుతుంది. కావేరి లేదు అమృత మేము కూడా అంత వెతికాము అంజలి మాకు కూడా కనపడలేదు అని అంటుంది.అంజలి మనకంటే ముందే దర్శనం చేసుకొని వెళ్ళిపోయింది అనుకుంటా అందుకే మనకు ఎవరికీ కనబడలేదు అని అంటాడు చంద్రం. కావేరి అయ్యా రామయ్య తండ్రి ఆలీ పంచాయతీ రామాయణం పాలి పంచాయతీ మహాభారతం అన్నట్టు నిలువెత్తున నుంచుని చూస్తూ ఉంటావు కానీ మాలాంటి వాళ్ళ బాధలు ఏమి పట్టించుకోవా అని అంటుంది.
అప్పుడే కానిస్టేబుల్ ఇద్ధరు అమృత వాళ్ళ దగ్గరికి వస్తారు వచ్చి ఏంటి మీరు మా దగ్గర నుండి తప్పించుకుని బయటపడ్డాము అని అనుకుంటున్నారా కాదు మేమే మిమ్మల్ని చూసి చూడనట్లుగా ఉండిపోయాం కాబట్టి మీరు బయటికి వచ్చారు. ఏంటి ఇలా గుళ్ళు గోపురాలు తిరగడమేనా మీ పని అంటారు.అరుణ్ కుమార్ మేమేమీ సరదాగా తిరగడానికి రాలేదు గుడిలో మా అమృత వాళ్ళ నాన్నగారి పేరుమీద అన్నదాన కార్యక్రమం చేయాలి అని వచ్చాము పదండి మీరు కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొందురు అని అంటాడు. కానిస్టేబుల్స్ అవసరం లేదు కావాలంటే మీరే చేసుకోండి మేము అక్కడే పక్కనే కూర్చుంటాం అంటూ వెళ్లిపోతారు.
అమృతవాళ్లు కావేరి వాళ్ళు నలుగురుకలిసి అన్నదాన కార్యక్రమం జరిపిస్తూ ఉండగా, జై చంద్ర ఫౌండేషన్ కి సంబంధించిన లాయరు ఆ కార్యక్రమంలో ఉన్న జై చంద్ర గారి ఫోటోను చూసి వీళ్ళు ఎవరు జై చంద్ర గారు ఫోటో పెట్టి అన్నదానం చేస్తున్నారు అంటే వీళ్ళు జై చంద్ర గారికి బంధువుల అని కుంటాడు. పంతులుగారు ఏమ్మా కార్యక్రమం పూర్తయిపోయిందా అని అడుగుతాడు. అమృత అయిపోయింది పంతులుగారు ఇక మేము వెళ్ళొస్తాము అని అంటుంది.పంతులుగారు మీ అంజలి బంటి ఎక్కడ ఉన్నా త్వరగా కలుసుకోవాలని ఆ శ్రీరామచంద్రుడి ఆశీస్సులు మీకు ఎల్లకాలం ఉండాలని ఆ దేవుని కోరుకుంటూ ఉంటాను తల్లి మీరు ఇక వెళ్ళిరండి అంటాడు.అమృత వాళ్లు వెళ్లిపోయాక.
కట్ చేస్తే ఆ లాయర్ పంతులు గారి దగ్గరకు వచ్చి ఏంటి పంతులుగారు వాళ్ళు మీకు బాగా తెలిసిన అనుకుంటా ఆ ఫోటో ఎవరిది ఆ ఫోటోలో ఉన్న వ్యక్తికి వీళ్ళు ఏమవుతారు అని అడుగుతాడు. పంతులు గారు మనసులో పాపం ఇప్పటికే అమృత వాళ్ల కుటుంబం చానా కష్టాల్లో ఉంది ఇప్పుడు వీళ్లు నాకు తెలుసు అని చెబితే ఇతను ఎవరో నాకు తెలియదు కొంపదీసి పోలీస్ అయితే పాపం ఆ కుటుంబానికి చాలా నష్టం జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఎవరో తెలియదు అని చెప్పాలి అని ఏమో నండి వాళ్ళు ఎవరో మాకు తెలియదు అందరూ వచ్చినట్లే వారు కూడా గుడికి వచ్చి దేవుడికి మొరపెట్టుకుంటారు తప్ప వాళ్ళు ఎవరో మాకు తెలియదు అని చెబుతాడు. లాయర్ సరే పంతులు గారు అంటూ వెళ్ళిపోతాడు లాయర్.
కట్ చేస్తే అంజలి సంజయ్ షాపింగ్ కి వెళ్తారు సంజయ్ అంజలి గారు నాకు ఈ షాపింగ్ అంటే తెలియదు మీరే వెళ్లి కావలసినవి ఏంటో తీసుకొని రండి నేను బయటే ఉంటాను అని సెండ్ చెయ్ బయట ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అంజలి షాపు లోపలికి వెళ్ళగానే టేబుల్ మీద ఉన్న న్యూస్ పేపర్ చూస్తుంది. ఆ పేపర్లో అమృతకు ఆరోగ్యం బాగోలేదని యుగంధర్ న్యూస్ రాయిస్తాడు అది చూసిన అంజలి మా అమ్మకు ఏమైందో అంటే వెంటనే బయటికి వచ్చి సంజయ్ కంటే పడకుండా అమృత వాళ్ళ ఇంటికి వెళ్లి పోతుంది అంజలి. అక్కడ గేటు దగ్గర పోలీసులు కాపలా ఉండడంతో వారిని తప్పించుకుని అంజలి లోపలికి వెళ్లి తలుపులు పెడుతుంది. అంజలిని చూసిన అమృత అమ్మ అంజలి నువ్వు ఎలా వచ్చావు నీకోసం బయట పోలీసులు కాపలా కాస్తున్నారు
కదా మరి నువ్వు ఎలా వచ్చావు నువ్వు బాగున్నావా అని అడుగుతారు అంజలి అమ్మ పోలీసులు నుండి తప్పించుకొని లోపలికి వచ్చాను వాళ్ళు నన్ను చూడలేదు నీకు ఒంట్లో ఆరోగ్యం బాగోలేదని పేపర్లో న్యూస్ చూసి వచ్చాను ఏంటమ్మా నీకు ఏమయ్యింది అని అంజలి అమృతం అడుగుతుంది అమృత లేదమ్మా నాకు ఏమీ కాలేదు నేను బాగానే ఉన్నాను ఎలాగైనా మిమ్మల్ని పట్టుకోవాలని ఆ యుగంధర్ ఆడుతున్న నాటకం అందుకే పేపర్లో ఆ న్యూస్ రాయించాడు అని చెబుతుంది అమృతం. అంజలి అలాగా అమ్మ పేపర్లో నీ గురించి నేను ఆ న్యూస్ చూడగానే నా గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లు అనిపించింది అందుకే ఎలాగైనా నిన్ను చూడాలి అంటూ ఆ పోలీసుల భారీ ఉండి కనపడకుండా తప్పించుకుని ఇంట్లోకి వచ్చాను ఇక నేను ఎలాగైనా నీకోసం ఇంటికి వస్తానని ఆ యుగంధర్ ఎదురుచూస్తూ ఉంటాడు అందుకే నేను ఎక్కువ రేపు ఇక్కడ ఉంటే చాలా ప్రమాదం అంటుంది అంజలి
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!