Madhuranagarilo February 24 2024 Episode 296: ఏం చేస్తున్నావ్ అత్తయ్య అని రుక్మిణి అడుగుతుంది. రాధకి శ్యామ్ కి శోభనం ఏర్పాటు చేస్తున్నాం అమ్మ అని అంటుంది మధుర. శ్యామ్ రాధకి శోభనం జరిపించి నాకు అన్యాయం చేయాలనుకుంటున్నారా అని రుక్మిణి అంటుంది. అదేంటమ్మా అలా అంటావ్ శ్యామ్ కి గండం ఉందని తెలుసు కదా మరి శ్యామ్ కి రాధకి శోభనం జరిపిస్తేనే కదా బాబు పుట్టేది హోమం చేసేది శ్యామ్ బ్రతికి ఉండేది అని మధుర అంటుంది. అయితే నన్ను నా బిడ్డను శాశ్వతంగా దూరం చేసి రాదని ఇంట్లోనే ఉంచుకోవాలనుకుంటున్నారా అత్తయ్య అని రుక్మిణి అంటుంది. నువ్వేమైనా అనుకో రుక్మిణి నా కొడుకు కోసం నేను చేస్తున్నాను నా కొడుకు బ్రతికి ఉండడం కోసం నీతో గొడవ పడాల్సి వచ్చిన పడతాను నీతో తెగదేపులు చేసుకోవాల్సి వచ్చినా చేసుకుంటాను నాకు మాత్రం నా కొడుకు ప్రాణాలే ముఖ్యం అని మధుర అంటుంది.
తెగేదాకా లాగితే వీలు ఇప్పుడే నన్ను బయటికి పంపించేలా ఉన్నారు అనుకుంటుంది రుక్మిణి. నేను అలా చేస్తానని మీరు ఎందుకు అనుకుంటారు అత్తయ్య అని రుక్మిణి నవ్వుతుంది. ఒక్కసారిగా ఎంత భయపడిపోయానో తెలుసా రుక్మిణి అని మధుర అంటుంది. నేనైతే హడలిపోయాను అనుకో అని ధనంజయ్ అంటాడు. నావల్ల మీరు భయపడాల్సిన అవసరం ఎప్పటికీ రాదు అత్తయ్య ఊరికే జోక్ చేశాను రాదకి శ్యామ్ శోభనం జరిపించండి నాకు సంతోషమే అంటూ రుక్మిణి వెళ్ళిపోతుంది. రుక్మిణి ఎంత మంచిదండి తన భర్తకి వాళ్ళ చెల్లెలకి శుభనమని తెలిసినా నవ్వుతూ మాట్లాడుతుంది అని మధుర అంటుంది. కట్ చేస్తే, ఎలా ఉన్నావ్ శోభనం పెళ్లికూతురా అని కృష్ణ అంటుంది. చేసిన మోసం చాలదని మళ్లీ ఎందుకు వచ్చావు అని రాదా అంటుంది.
నేనేం మోసం చేశాను రాదా ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోకూడదని అంటే ఏదో మాట సహాయం చేశాను అంతేకానీ నేను కావాలని చేయలేదు కదా ఇప్పుడైనా మేము ఆడిన అబద్ధం నిజం అవుతుంది కదా శ్యామ్ గండానికి నీకు పుట్టబోయే బిడ్డకు లింకు పెట్టి మంచి పని చేశాడు ఎందుకు అంటే నువ్వు ఇక్కడే ఉండి మీ అక్క నిజస్వరూపం తెలుసుకుంటావు అని కృష్ణ అంటుంది. చూడు రాదా శ్యామ్ ని మీ అక్క మంచి చేసుకోవడానికి రాలేదు నిన్ను శ్యామ్ విడదీసి సంతోషిస్తుంది తనకు బిడ్డ కూడా అవసరం లేదు రాదా నేను ఎంత చెప్పాక కూడా నువ్వు నన్ను క్షమించకపోతే నీ ఇష్టం అని కృష్ణ అంటుంది. సరేలే అని రాదా అంటుంది. అయితే నన్ను క్షమించినట్టేనా అని కృష్ణ అంటుంది. నువ్వు ఇంతగా చెప్పాక నమ్మకపోతే ఎలా అని రాధా అంటుంది. ఓకే శోభనం పెళ్లి కూతురా త్వరగా రెడీ అవ్వు అంటూ కృష్ణ వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, రాధాని శోభనం గెటప్ లో చూసి చాక్ అవుతుంది రుక్మిణి.
నువ్విలా చేస్తావని నేను అసలు అనుకోలేదు రాదా నా భర్తను నాకు వదిలిపెట్టి శాశ్వతంగా వెళ్ళిపోతాను అన్నావు కానీ ఇప్పుడు నా భర్త తోటి కాపురం చేసి బిడ్డను కలవడానికి సిద్ధపడుతున్నావ్ అని రుక్మిణి అంటుంది. శ్యామ్ సార్ కి గండం అని తెలిసింది కదా అక్క మరి ఏం చేద్దాం అని రాదా అంటుంది. నువ్వు ఎవరి కోసం శోభనం ఆపవలసిన పనిలేదు రాదా శ్యామ్ వద్దన్నా సరే శోభనం ఆపకు అని రుక్మిణి అంటుంది. సరే అక్క నువ్వు చెప్పినట్టే ఎవరు చెప్పినా శోభనం ఆగకుండా చూసుకుంటాను అని రాదా అంటుంది. కట్ చేస్తే నీ చేతనే శోభనం ఆగేలా చేద్దామనుకున్నాను అది వర్క్ అవుట్ అవ్వలేదు ఈ పాలల్లో మత్తుమందు కలిపి ఇస్తాను పాలు తాగి నైట్ అంతా హాయిగానిద్రపొ అని రుక్మిణి పాలలో మత్తుమందు కలుపుతుంది.
ఇంతలో దాక్షాయిని వచ్చి ఏం చేస్తున్నావు రుక్మిణి అని అడుగుతుంది. నువ్వు చెప్పిన మాటలన్నీ బాగా అర్థం చేసుకున్నాను రాధకి శ్యామ్ కి శోభనం జరగకుండా పాలలో మత్తుమందు కలుపుతున్నాను పిన్ని అని రుక్మిణి అంటుంది. అయితే నేను తీసుకెళ్లి ఇస్తాను ఇవ్వు అని దాక్షాయని పాలు తీసుకు వెళుతుంది. కట్ చేస్తే, రాధా ఈ పాలు తీసుకో అమ్మ ఎందుకు అంత సిగ్గు పడుతున్నావ్ అని దాక్షాయని అంటుంది. నా ముందు సిగ్గుపడితే పడ్డావు కానీ శ్యామ్ ముందు సిగ్గు పడకు అని దాక్షాయిని అంటుంది.
రాధా ప్రతి ఆడదాని జీవితంలో మొదటి రోజు ఇది ఎన్నో ఆశలతో జీవితాన్ని మొదలుపెడదాం అనుకుంటారు ఈ అదృష్టాన్ని వదులుకోవద్దమ్మా అని మధుర అంటుంది. నీ సిగ్గు శ్యామ్ కూడా కొంచెం దాచు అని కృష్ణ అంటుంది. బాగా చెప్పారు అత్తయ్య నేను కూడా రాధకి అదే చెప్తున్నాను అని రుక్మిణి అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!