Madhuranagarilo March 15 2024 Episode 313: ప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మంచిగా బ్రతుకక్క అని రాదా అంటుంది. అల్లుడుగారు మంచివాడు కాబట్టి విడిపిస్తున్నాడు రాధ చెప్పినట్టు ఇకమీదటైనా నువ్వు బుద్ధిగా ఉండు అని నాగమణి అంటుంది. శ్యామ్ కేసు వాపస్ తీసుకుని తనని విడిపిస్తాడు. చూడక్కా నువ్వు ఆస్తిని అడిగి పండు ని ఇంటికి తీసుకు వెళ్ళావని ఆయన ఇలా చేశాడు నువ్వు ఎంతో మంచి దానివని నిన్ను నమ్మి నేను ఇంటికి తీసుకువెళ్లి తప్పు చేశాను నీవల్ల అబద్ధం ఆడని నేను కూడా అబద్ధం ఆడాల్సి వచ్చింది జీవితమంతా అబద్దాలతో కాకుండా ఇకమీదటైనా మంచిగా జీవించు నా చేత అబద్ధం ఆడించిన నిన్ను ఎప్పటికీ క్షమించను అని రాదా చెబుతుంది. కుక్క తోకకి రాయి కడితే సక్కగా వస్తుందా రాదా మీ అక్క కూడా అంతే అని శ్యామ్ అంటాడు.
కట్ చేస్తే, టిఫిన్ చేద్దువు గాని రా అని నాగమణి అంటుంది. నా ఆకలి చచ్చిపోయింది నీ అల్లుడు గారు నా మీద కేసు పెట్టి నన్ను జైల్లో పెట్టాడు కదా నా ఆకలి అంతా చచ్చిపోయింది కడుపు రగిలిపోతుంది అని రుక్మిణి అంటుంది. నువ్వు పండుని ఇంటికి తీసుకురాకపోతే అల్లుడుగారు అలా చేసేవాడు కాదు కదా తప్పంతా నీదే అని మురళి అంటాడు. తప్పంటే నాదేనా అయితే నన్ను జైల్లో పెట్టినందుకు ఇంతకీ ఇంత పగ తీర్చుకుంటా వాళ్లకి ఎలా బుద్ధి చెప్పాలో చెప్తా అని రుక్మిణి అంటుంది.కట్ చేస్తే,రాధా అందరికీ కాఫీ తెచ్చి ఇస్తుంది. అందరు కాఫీ తాగుతూ ఉంటారు. పండుకోసమని పాలు తీసుకువెళ్తుంది రాదా. అక్కడికి వెళ్లి చూసేసరికి పండు లేడు కిందికి వచ్చి రాదా? పండు తన గదిలో లేడండి ఎక్కడికి వెళ్లాడు అని అంటుంది. పొద్దున్నే ఆడుకోడానికి వెళ్తే ఇంట్లో ఎక్కడుంటాడమ్మా అని దాక్షాయిని అంటుంది. రాధా బయటికి వెళ్లి అందరిని పండు ఆడుకోడానికి వచ్చాడా అని అడుగుతుంది కానీ ఎవరు రాలేదు చూడలేదని చెబుతారు. కంగారు పడిపోయినా రాదా వెళ్లి పండు బయట కూడా లేడు అని చెబుతుంది. శ్యామ్ మేం బయట వెతుకుతాం మీరు లోపల వెతకండి రా అనని ధనంజయ్ చలపతి బయటికి వెళ్లి వెతుకుతారు. రాధా శ్యామ్ ఇల్లంతా వెతుకుతారు కాని పండు ఎక్కడా దొరకడు. పండు బయట కూడా లేడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడా అని ధనంజయ్ అంటాడు.
పండు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే చెప్పి వెళ్తాడు మామయ్య అని రాదా అంటుంది. ఇంతలో రుక్మిణి రాధకి ఫోన్ చేస్తుంది. మా అక్క ఫోన్ చేస్తుందండి అని రాదా అంటుంది. అయితే స్పీకర్ పెట్టి మాట్లాడు రాదా అని శ్యామ్ అంటాడు. రాధా ఫోను ఎత్తి హలో అక్క అని అంటుంది. ఏంటి రాధా గొంతు వణుకుతుంది పాల గ్లాసు పట్టుకుని పైకి వెళ్లేసరికి పండ్లు లేడా అని రుక్మిణి అంటుంది. ఏంటి నా మీద కేసు పెట్టి పండుని తీసుకువెళ్లినంత మాత్రాన నేను వదిలిపెడతానని ఎలా అనుకున్నావు రాదా అందుకే మనుషుల్ని పెట్టి పండు నీకు కిడ్నాప్ చేయించాను అని రుక్మిణి అంటుంది.
ఎందుకక్కా పండు నీకు కిడ్నాప్ చేయించావు అని రాధా అడుగుతుంది.పండు నీ దత్తత ఇవ్వడానికి అని రుక్మిణి అంటుంది. నా కొడుకుని దత్తత ఇవ్వడానికి నువ్వెవరు అని శ్యామ్ అంటాడు. కన్నతల్లిని అందుకే నా కొడుకుని ఒక ఎన్నారైకి దత్తత ఇచ్చి అమెరికా పంపించాలనుకుంటున్నాను అని రుక్మిణి చెబుతుంది. నువ్వు కన్నతల్లివి అయితే నేను కన్న తండ్రి నేను లేకుండా నువ్వు ఎలా దత్తతీస్తావు అని శ్యామ్ అంటాడు. శ్యామ్ సుందర శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలని పండుని దత్తత తీసుకునే వాళ్ళకి పండు తండ్రి చచ్చిపోయాడని చెప్పాను అందుకే వాళ్ళు దత్తత తీసుకుంటున్నారు ఊరికే ఏమి ఇవ్వడం లేదు 50 లక్షలు ఇస్తున్నారు అందుకే పండుని వాళ్ళకి దత్త తీస్తున్నాను అని రుక్మిణి అంటుంది.
50 లక్షలు కావాలంటే నీ మొహాన కొడతాను అని శ్యామ్ అంటాడు. కుదరదు శ్యామ్ అని రుక్మిణి అంటుంది. అయితే ఎంత కావాలి కోటి రూపాయల చెప్పు అని శ్యామ్ అంటాడు. నీ ఆస్తి మొత్తం కావాలి ఆస్తినంతా నా పేరు మీద రాసి మీరు ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి అప్పుడే పండుని మీకు అప్పగిస్తాను అని రుక్మిణి అంటుంది. చూడు రుక్మిణి నువ్వెక్కడున్నావో చెప్పు వచ్చి నీతో మాట్లాడుతాను అని శ్యామ్ అంటాడు. అంత తెలివి తక్కువ పని నేనెందుకు చేస్తాను శ్యామ్ ఆస్తినంతా నాకిస్తానని నిర్ణయం తీసుకొని అప్పుడు ఫోన్ చేసి చెప్పు దత్తత ఆపేసి పండుని అప్పగిస్తాను లేదంటే పండు ని వాళ్లకు దత్తతి ఇచ్చేస్తాను ఆలోచించుకొని నీ నిర్ణయం ఏంటో చెప్పు అని రుక్మిణి ఫోన్ కట్ చేస్తుంది. కట్ చేస్తే,ఆ మాటలువిన్న రాదా బాధపడుతుంది. అనుకున్నాను రుక్మిణి జైల నుంచి వచ్చాక ఇలాంటిదేదో చేస్తుందని అనుకున్నాను అని దాక్షాయని అంటుంది.
అనుకోకపోతే పండుని దగ్గర ఉంచుకోవచ్చు కదా అని ధనంజయ్ అంటాడు. ఇంత తొందరగా పండు నీకు కిడ్నాప్ చేస్తుందని ఎల అనుకుంటారు అన్నయ్య అని దాక్షాయిని అంటుంది. శ్యామ్ పండు కోసం ఆసినంత ఇచ్చేస్తానని చెప్పు అని ధనుంజయ్ అంటాడు. పండు లేకపోతే రాధ బ్రతకదు రాధ కోసం పండు కావాలి ఆస్తినంతా ఇచ్చేసి పండును తెచ్చుకుందాం అని శ్యామ్ అంటాడు. రుక్మిణి కి ఫోన్ చేసి చెప్పరా అని ధనంజయ్ అంటాడు. శ్యామ్ రుక్మిణికి ఫోన్ చేస్తాడు. ఏంటి శ్యామ్ ఏం నిర్ణయించుకున్నావ్? ఆస్తిని ఇచ్చి పండుని తీసుకెళ్తావా ఆస్తినించుకొని పండును వద్దనుకుంటావా అని రుక్మిణి అడుగుతుంది. ఆస్తినంతా ఇచ్చేసి పండుని తీసుకెళ్తాను ఆస్తి మాకు అక్కర్లేదు పండే కావాలి దత్తత కార్యక్రమం ఆపేయ్ అని శ్యామ్ అంటాడు. దత్తత కార్యక్రమం ఆపాలి అంటే ఆస్తి పేపర్లు నా చేతిలో ఉండాలి అని రుక్మిణి అంటుంది దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!