సూపర్స్టార్ మహేష్ 25వ చిత్రం `మహర్షి` రెండు పాటలు మినహా చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ రెండు పాటలను కూడా ఏప్రిల్ 12 నాటికి పూర్తి చేసి సినిమాను మే 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ను స్టార్ట్ చేయబోతున్నారు. అందులో భాగంగా తొలి పాటను మార్చి 29న విడుదల చేయబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యం వహించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్రాజు, అశ్వినీదత్, పివిపి ఈ చిత్రాన్ని నిర్మించారు. పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా.. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా తర్వాత మహేష్ జూలైలో అనీల్ రావిపూడి సినిమాను స్టార్ట్ చేస్తాడు. ఈ సినిమాకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ శరవేగంగా జరుగుతుంది.
previous post
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!