మహేశ్ హీరోగా నటించిన `1 నేనొక్కడినే` చిత్రంలో ఆయన కుమారుడు గౌతమ్ కీలక పాత్రలో నటించాడు. ఇప్పుడు మహేశ్ కుమార్తె సితార కూడా వెండితెరపై సందడి చేయనుంది. అయితే అది మాటల రూపంలో మాత్రమే. వివరాల్లోకెళ్తే ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ రూపొందించిన చిత్రం `ఫ్రోజెన్ 2`. ఈ యానిమేషన్ చిత్రంలో ఎల్సా చిన్నప్పటి పాత్రకు సితార డబ్బింగ్ చెప్పిందని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఎల్సా పెద్దయిన తర్వాత పాత్రకు నిత్యామీనన్ తెలుగులో డబ్బింగ్ చెప్పారు. ఈ చిత్రంలో ఈ నెల 22న హాలీవుడ్తో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. క్రిస్ బక్, జెన్నీఫర్ లీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
previous post
next post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!