SVP: “సర్కారు వారి పాట” సినిమా విజయోత్సవ సభ కర్నూలులో జరిగిన సంగతి తెలిసిందే. మొదట ఈ సభను విజయవాడ సిద్ధార్థ కాలేజ్ కళాశాల మైదానంలో నిర్వహించాలని సినిమా మేకర్స్ డిసైడ్ అయ్యారు. కానీ అనుకోకుండా విజయవాడ నుండి వేదిక కర్నూలు కి మారింది. రెండు రోజుల వ్యవధిలోనే ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చక్కగా జరగటంతో.. కర్నూలులో విజయోత్సవ సభలో మహేష్ సంచలన స్పీచ్ ఇచ్చారు. ఎప్పుడో తన కెరియర్ లో “ఒక్కడు” సినిమా చేస్తున్న సమయంలో కర్నూలు రావడం జరిగిందని మళ్ళీ ఇప్పుడే వచ్చినట్లు మహేష్ తెలిపారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇంతమంది జనం వస్తారని… అసలు ఊహించలేదు. అందువల్లే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయాలని స్టేజి డాన్స్ వేసా అని మహేష్ చెప్పుకొచ్చారు. ఇక “సర్కారు వారి పాట” సినిమా గురించి మాట్లాడుతూ ఫస్ట్ టైం ఫ్యామిలీతో చూశానని తెలిపారు. సినిమా ఫస్ట్ టైం కుటుంబంతో నా కొడుకు షేక్ హ్యాండ్ ఇచ్చి గట్టిగా హగ్ చేసుకున్నాడు. మా అమ్మాయి సితార అయితే నువ్వు అన్ని సినిమాల్లో కంటే ఈ సినిమాలో బాగా చేశావు నాన… చాలా అందంగా ఉన్నావు అని చెప్పింది.. సర్కారు వారి పాట నా కెరీర్లో మర్చిపోలేని సినిమా అని మహేష్ చాలా ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు.
ముఖ్యంగా అభిమానులు సినిమా పట్ల చూపించిన అభిమానం ఎన్నటికీ మరువలేనిది. మా నాన్నగారు కృష్ణ.. సినిమా చూశాక దూకుడు పోకిరి తరహాలోనే.. ఈ సినిమా విజయం సాధిస్తుందని చెప్పారు చాలా ఆనందం వేసింది. ఇంతగా సినిమా విజయం సాధించడంలో మీరు చూపించిన అభిమానం జీవితం లో మరిచి పోలేనిది అంటూ “సర్కారు వారి పాట” కర్నూలు విజయోత్సవ సభలో.. మహేష్ అదరగొట్టే స్పీచ్ ఇచ్చారు. ఊహించని విధంగా ఈ వేడుకకు జనాలు పోటెత్తారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!