Malli Nindu Jabili February 23 2024 Episode 580: అరవింద్ లేడు నా బిడ్డ లేడు ఇంక నేను ఎందుకు బ్రతికి ఉండాలి చచ్చిపోతాను డాడీ అని మాలిని పరిగెత్తుతుంది. మాలిని వద్దమ్మా నీ వసుంధర శరత్ మాలిని ఆపుతారు. కట్ చేస్తే, మల్లి బాధపడుతూ వాళ్లకి కనిపిస్తుంది. దీని కన్నీళ్లు నమ్మొద్దు మాలిని అని వసుంధర అంటుంది. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా అని మాలిని అంటుంది. అరవింద్ బాబుని చూపించాలని తీసుకువెళ్లను కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు నన్ను క్షమించక్క అని మల్లి అంటుంది.
నిన్ను క్షమిస్తే చచ్చిపోయిన నా అరవింద్ నా బిడ్డ బ్రతికి వస్తారా అని మాలిని అంటుంది. పొరపాటున అలా జరిగిపోయింది అక్క అని మల్లి అంటుంది. నేను బ్రతికి ఉండడానికి ఒక్క కారణాన్ని కూడా లేకుండా చేశావు అని మాలిని అంటుంది. జరిగిన దాంట్లో మల్లి తప్పేమీ లేదు కదా అని శరత్ అంటాడు. ఇలాంటి సమయంలో కూడా మీ పక్షపాత బుద్ధిని చూపించకండి అని వసుంధర అంటుంది. నీకు జరిగిన దానికి నన్ను శిక్షించు అక్క కానీ అరవింద్ బాబు మాత్రం బ్రతికే ఉన్నాడని నాకు నమ్మకం ఉంది అని మల్లి అంటుంది.
నీకు ఫోన్ వచ్చిందో నువ్వు అబద్దం చెప్పావు కాసేపట్లో తేలిపోతుంది నాతో పాటు రా అని మాలిని అంటుంది. మాలిని దీంతో పాటు వెళ్తే బాగోదు అని వసుంధర అంటుంది. అటో ఇటో తేల్చుకొని వస్తాను మీరు ఇంటికి వెళ్ళండి అని మాలిని మల్లి తీసుకొని వెళ్ళిపోతుంది. నా కూతుర్ని నీకు ఏమైనా చేయాలి దాన్ని చంపి సమాధి కడతాను అని వస్తుందర అంటుంది. కట్ చేస్తే, వదిన కి ఫోన్ చేసావా అని గౌతమ్ అడుగుతాడు. ఆ మాలిని ఎక్కడికి తీసుకెళ్ళిందో తెలియదు అన్నయ్య అని నీలిమ అంటుంది. వదిన వస్తే నాకు ఫోన్ చేయించు నేను ఆఫీస్ కి వెళ్తున్నాను అని గౌతమ్ వెళ్తూ ఉండగా మాలిని వాళ్ళు వస్తారు.
మల్లి అరవింద్ బతికున్నాడని తీసుకువెళ్లావు కదా ఎక్కడికి తీసుకువెళ్లావ్ అని గౌతమ్ అంటాడు. అరవింద్ బ్రతికే ఉన్నాడా ఉంటే మీతో పాటు తిరిగి వచ్చేవాడు కదా అసలు ఏం జరుగుతుంది అని గౌతమ్ అంటాడు. నిన్ను అరెస్టు నుంచి కాపాడడానికి నీ భార్య అబద్ధం చెప్పి నన్ను అక్కడికి తీసుకు వెళ్ళింది లోకంలో ఎవరికి ఇలాంటి చెల్లెలు ఉండకూడదు ఇలాంటిది ఉంటే రక్త సంబంధాలు మంట కలిసి పోతాయి అని మాలిని అంటుంది. ఆ దైవం నడిపించినట్టే నడిచాను తీరని చేరుకున్నాక అంతా శూన్యం అయిపోయింది అని మల్లి అంటుంది. నా భర్తను కాపాడుకోవడానికి నా అక్కని మోసం చేసే అంత సంస్కారహీనురల్ని కాదు నేను అని మల్లి బాధపడుతుంది. గౌతమ్ నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి పదకో అని గౌతమ్ ని తీసుకొని వెళుతుంది మాలిని.
శంకరమ్మ కి ఫోన్ చేసి అరవింద్ చనిపోయిన చోటికి రమ్మని చెబుతుంది మాలిని. అరవింద్ బాబు చనిపోయిన చోటుకి ఎందుకు రమ్మంటున్నారు మాలిని అమ్మగారు అని శంకరమ్మ అనుకుంటుంది. మీరా అమ్మగారు మాలిని అమ్మ ఇప్పుడే ఫోన్ చేసి అరవింద్ చనిపోయిన చోటికి రమ్మని చెప్పింది నేను వెళ్తున్నాను అని శంకరమ్మ అంటుంది. కూర్చొని తిన్న తరగని ఆస్తుంది కానీ ఏం లాభం మా మధ్య సవతుల పోరాటం అక్కా చెల్లెల మధ్య కత్తుల పోరాటం చివరికి ఏ దారికి చేరుస్తావో అని మీరా దేవుడి దగ్గర కూర్చొని అంటుంది. కష్టాలకి కన్నీళ్ళకి ముగింపు పలుకయ్య అని మీరా బాధపడుతుంది. కట్ చేస్తే,
ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు మాలిని అని గౌతమ్ అంటాడు. ఇక్కడికెందుకు తీసుకొచ్చావు మాలిని అమ్మ అని శంకరమ్మ అంటుంది. నా భర్తని ఎక్కడ చంపారో చెప్పు శంకరమ్మ అని మాలిని అంటుంది. ఇక్కడే ఆటో కారు ఇటు ఒక కారు వచ్చిందమ్మా కారులో నుంచి నలుగురు దిగారు ఒకడు మాత్రం కారులోనే కూర్చున్నాడు ఆ నలుగురు అరవింద్ బాబు మీద పడి కొట్టి చంపేసి ఈ నీళ్లలోనే పడేవేశారు అని శంకరమ్మ చెబుతుంది. అరవింద్ నువ్వు లేని బ్రతుకు నాకు అక్కర్లేదు నీ దగ్గరికి వచ్చేస్తాను ఏడేళ్ల ప్రేమ గుర్తుగా నాకు నువ్వు ఇచ్చే గిఫ్ట్ ఇదేనా నేను ఇంకా ఎలా బ్రతికి ఉండగలను బిడ్డ దూరమయ్యాడు నువ్వు లేవు నేను ఇంకెవరి కోసం బ్రతకాలి అని మాలిని ఏడుస్తూ చచ్చిపోతాను అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!