Malli Nindu Jabili February 27 2024 Episode 583: మీ మౌనానికి అర్థం ఏంటో నాకు తెలుసు డాడీ అని మాలిని అంటుంది. నేనే వెళ్లి గౌతమ్ మీద కేసు పెడతాను అని మాలిని అంటుంది. కట్ చేస్తే, స్వామీజీ చెప్పగానే అక్కకి అరవింద్ బాబుని గిఫ్ట్ గా ఇవ్వలని అనుకున్నాను మా ఆయన చేసిన పని వల్ల తన బిడ్డను దూరం చేసిన దాన్ని అయిపోయాను ఎలాగైనా సరే అరవింద్ బాబుని నేనే వెతికి తెచ్చి అక్కకు అప్పగించాలి అని మల్లి ఆలోచిస్తుంది. నా మాట కు గౌరవించి నువ్వు మాలినిని కలవకుండా ఉన్నందుకు సంతోషంగా ఉంది మల్లి అని గౌతమ్ అంటాడు. ఇక మనం సంతోషంగా పిల్లల్ని కంటే బాగుంటుంది అని గౌతమ్ మల్లి ఒంటి మీద చేయి వేస్తాడు. వదలండి అంటూ మల్లి దూరంగా వెళుతుంది. గౌతమ్ వచ్చి మల్లిని కౌగిలించుకుంటాడు. అబ్బ వదలండి ప్లీజ్ అని మల్లి బాధతో అంటుంది.
మాలిని దగ్గరికి వెళ్ళనివ్వలేదని కోపంగా ఉన్నావా అని గౌతమ్ అంటాడు. అదేమీ లేదు అని మల్లి వెళ్లి పడుకుంటుంది. ఈరోజు మాట వినేలా చేశాను రేపు ఎలాగో అలా కన్విన్ చేసుకోవాలి అని గౌతమ్ మల్లి కి గుడ్ నైట్ చెప్తాడు. రేపు నన్ను కొట్టిన తిట్టినా సరే మాలిని అక్కను కలిసి రావాలి అని మల్లి అనుకుంటుంది. కట్ చేస్తే, కౌసల్య పంతులు గారిని పిలిపిస్తుంది. పంతులు గారిని ఎందుకు పిలిపించావమ్మా అని గౌతమ్ అంటాడు. ఇంట్లో సమస్యలన్నీ రోజురోజుకీ పెరుగుతున్నాయి అవన్నీ పోయి మీకు పిల్లలు పుట్టాలి అంటే పంతులుగారు యాగం జరిపిస్తాడు అని కౌసల్య చెబుతుంది. పంతులుగారు మీరు ఏమి ఆలోచించకుండా ఏ రోజు మంచి రోజు ఉందో చూసి చెప్పండి యాగం జరిపిద్దాం అని కౌసల్య అంటుంది.
మీ కష్టాలన్నీ దూరమై మీకు సంతాన భాగ్యం కలిగే ఒక యాగం ఉందమ్మా అది జరిపిస్తే కష్టాలన్నీ పోతాయి సంతానం కూడా కలుగుతుంది ఆనందంగా ఉంటారు అని పంతులుగారు చెబుతారు. అయితే ఎప్పుడు జరిపించాలో చెప్పండి అని కౌసల్య అంటుంది. రేపు మంచి రోజమ్మ జరిపిస్తే బాగుంటుంది అని పంతులుగారు చెబుతారు. అయితే రేపే జరిపిద్దాం అని కౌసల్య అంటుంది. మల్లి ఇంతలో అక్కడికి వస్తుంది. మల్లి కి ఇవన్నీ ఇష్టం లేదు కదా అమ్మ అని గౌతమ్ అంటాడు. అని దానికి చెప్పి చేయాల్సిన అవసరం లేదు అని కౌసల్య అంటుంది. నాకు కొంత సమయం కావాలని చెప్పాను కదండీ మళ్లీ వ్రతాలు పూజలు ఏంటి అని మల్లి అంటుంది. పిల్లల కోసం కాకపోయినా ఇంట్లో సమస్యలన్నీ పోవాలంటే యాగం జరిపించాలి అని కౌసల్య అంటుంది. కట్ చేస్తే, మీరా మల్లి కి ఫోన్ చేస్తుంది. ఎలా ఉన్నావ్ అమ్మ అని మల్లి అడుగుతుంది.
నేను బాగానే ఉన్నానమ్మ కానీ వసుంధరమ్మ గారి కంటే ఇప్పుడు మాలిని అమ్మగారే నీ మీద పగ పెంచుకుంది నీ మీద కోపంతో రగిలిపోతుంది అని మీరా చెబుతుంది. నేను అక్కకు మంచి చేయాలనుకున్నా కొద్ది అక్కకు చెడే జరుగుతుంది ఏం చేయను అని మల్లి బాధపడుతుంది. ఈ కష్టాలు ఎప్పుడు ఉండేవే కానీ గౌతమ్ బాబు వాళ్ళు ఎలా ఉన్నారు అమ్మ అని మీరా అడుగుతుంది. ఏం చెప్పనమ్మా ఆయన ఈ పరిస్థితుల్లో పిల్లలు కావాలని అంటున్నారు నాకు ఇష్టం లేదన్న సరే రేపు పిల్లల కోసం యాగ జరిపించడానికి పంతులు గారి చేత ముహూర్తం పెట్టించారు అని మల్లి అంటుంది. పిల్లల్ని ఎందుకు వద్దనుకుంటున్నావమ్మా అని మీరా అడుగుతుంది. అక్క బాధలో ఉంటే నేను పిల్లల కోసం యాగం చేసుకుటే బాగుంటుందా చెప్పమ్మా అని మల్లి అంటుంది.
చూడు మల్లి గౌతమ్ బాబు పోయిన ఆస్తులన్నీ తెచ్చి ఇవ్వమని నిన్ను అనడం లేదు కదా పిల్లలు కావాలి అంటున్నాడు వాళ్ళింట్లో నువ్వు మహాలక్ష్మిలా కాలు పెట్టావు ఇప్పుడు పిల్లల్ని ఇచ్చి వాళ్ళకు సంతోషాన్ని ఇవ్వు నిన్నుఎంతగానో ప్రేమించే భర్తకి బిడ్డను కలిస్తే దాంట్లో తప్పేముందమ్మా బిడ్డను కనాలంటే తోమి నెలలు టైం పడుతుంది ఆ లోగా ఈ బాధలన్నీ తీరిపోయి మంచి రోజులు వస్తాయి బిడ్డ పుట్టాకైనా మీ జీవితాల్లో సంతోషం వస్తుందేమో అని మీరా అంటుంది. నా మాట వింటావు కదూ గౌతమ్ బాబుని బాధ పెట్టకు అని మీరా అంటుంది. అలాగేనమ్మ నువ్వు చెప్పినట్టే చేస్తాను అని మల్లి అంటుంది. కట్ చేస్తే, గౌతమ్ బాధపడుతూ కూర్చుంటాడు. మల్లి వచ్చి తన పక్కన కూర్చుంటుంది. గౌతమ్ దురం జరుగుతాడు.
యాగము వద్దన్నందుకు ఇంకా కోపం పోలేనట్టుంది అని మల్లి అంటుంది. డోంట్ టచ్ మీ అన్నాక కోపం రాక ఇంకేం వస్తుంది మేడం అని గౌతమ్ అంటాడు. మేడమ్ అని ఎందుకు పిలుస్తున్నారు అండి మల్లి అనే పిలుపులో మాధుర్యం ఉంది నన్ను అలాగే పిలవండి అని మల్లి అంటుంది. నేను దగ్గరవుతున్న కొద్ది నువ్వు దూరం పెడుతున్నావ్ నాకు కోపం రాదా అని గౌతమ్ అంటాడు. రేపు యాగానికి ఒప్పుకుంటున్నాను అని మల్లి అంటుంది. అవునా అని గౌతమ్ మల్లి నీ ఎత్తుకొని గిరగిరా తిప్పుతాడు. మల్లి ఈ ఆనంద సమయంలో నేను ఒకటి అడుగుతాను ఇస్తావా అని గౌతమ్ అంటాడు. నేను ఇచ్చేది అడిగితే ఇస్తాను అని మల్లి అంటుంది. భార్యాభర్తలు ఇచ్చిపుచ్చుకునేదే అడుగుతాను అని గౌతమ్ అంటాడు. సరే అడగండి అని మల్లి అంటుంది నాకు ఒక ముద్దు పెట్టవా అని గౌతమ్ అంటాడు. ఇది సమయం కాదు వెన్నెల రాతిరి డాబా పైన పెడితే బాగుంటుంది అని మల్లి అంటుంది. నువ్విచ్చేదేంటి నేనే తీసుకుంటాను అని గౌతమ్ మల్లి ని పట్టుకుంటాడు.. దీనితో ఈరోజే ఎపిసోడ్ ముగుస్తుంది.
Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!