Malli Nindu Jabili February 28 2024 Episode 584: గౌతమ్ ముద్దు పెట్టబోతు ఉండగా మల్లి గౌతమ్ ని నెట్టేసి పరిగెత్తుతుంది. కట్ చేస్తే, శరత్ మాలిని అన్న మాటలు గుర్తుకు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు. కౌసల్యమ్మ గారు యాగం జరిపిస్తున్నారంట నన్ను రమ్మన్నారు అని మీరా అంటుంది. యాగమా దేనికి అని శరత్ అంటాడు. ఇంట్లో పరిస్థితులు బాగోలేదని పరిస్థితులు చక్కబడాలని వాళ్లకి పండంటి బిడ్డలు పుట్టాలని యాగం చేస్తుందంట రేపు వెళ్లాలి మల్లి రమ్మని చెప్పింది అని మీరా అంటుంది. మనుషుల వల్ల కానిది పూజల వలన నైనా మనశ్శాంతి దొరుకుతుందేమో అని శరత్ అంటాడు. వసుంధరమ్మ గారిని కూడా రమ్మని పిలుస్తాను అని మీరా అంటుంది. వద్దు మీరా ఇప్పుడు నువ్వు చెప్పితే అగ్ని మీద గుగ్గిలం పోసినట్టు ఉంటుంది మనం మాత్రమే యాగానికి వెళ్లొద్దాం మాలిని బాధలో ఉంది కదా మీరు యాగాలు యజ్ఞం ఎలా చేసుకుంటారు అని గొడవ చేస్తుంది అందుకే మనం మాత్రమే వెళ్ళొద్దాం అని శరత్ అంటాడు. మాలిని వాళ్ల మాటలు అన్ని వింటుంది.
నా మనసుకు గాయాలు దానికి యాగాల మీరంతా ఒకటే పోయి నన్ను ఇంకా ఏడిపిస్తున్నారు అని మాలిని బాధపడుతుంది.అయాగం ఎలా జరుగుతుందో నేను చూస్తాను అ మాలిని అనుకుంటుంది. కట్ చేస్తే, మల్లి గుడికి లేట్ అవుతుంది త్వరగా రా అని గౌతమ్ పిలుస్తాడు. మల్లి వచ్చి తన ఎదురుగా నిలబడుతుంది. మల్లి నీ చూసి అలాగే నిలబడిపోతాడు గౌతమ్. అన్నయ్య అని నీలిమా పిలుస్తుంది. గౌతమ్ పలకడు. గౌతమ్ ఏం ఆలోచిస్తున్నావ్ రా అని కౌసల్య ఉంటుంది. అన్నయ్య వదిన అందాన్ని చూసి మైమరిచిపోతున్నాడమ్మా అని నీలిమ ఉంటుంది. బయలుదేరుదామా అని గౌతమ్ అంటాడు. మల్లి వాళ్ళందరూ గుడికి బయలుదేరుతారు. కట్ చేస్తే, మీరా రెడీ అవుతుండగా మాలిని చూస్తుంది. శరత్ రెడీ అవుతున్నాడా లేదా అని మాలిని చూస్తుంది. ఇద్దరు రెడీ అయ్యి వెళ్లడానికి కిందికి వస్తారు. వసుంధర చూడలేదు కదా అని శరత్ అంటాడు. పైనున్నట్టున్నారు బాబు అని మీరా అంటుంది. బయలుదేరుదామా అని శరత్ వెళ్తూ ఉండగా మాలిని డాడీ అని పిలుస్తుంది. మాలిని దగ్గరికి వచ్చి ఎక్కడికి వెళ్తున్నారు డాడీ అని అడుగుతుంది.
తెలిసిన వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది వెళ్తున్నాం అని శరత్ అంటాడు.మీకు తెలిసిన వాళ్ళ మీరాకు తెలిసిన వాళ్ళ అని మాలిని అంటుంది. ఇద్దరికీ తెలిసిన వాళ్ళు అని శరత్ అంటాడు. మరి మమ్మీని తీసుకువెళ్లట్లేదేంటి అని మాలిని అంటుంది. చెప్పిన తను రాదు కదా అని శరత్ అంటాడు. సరే డాడ్ ఇప్పుడు మీరాతో కాకుండా నాతో బయటికి రావాలి అని మాలిని అంటుంది. ఎక్కడికి అని శరత్ అంటాడు. మనసు ప్రశాంతంగా లేదు అందుకే గుడికి వెళ్దాం అనుకుంటున్నాను తీసుకువెళ్లండి ఫంక్షన్ దగ్గరికి తర్వాత వెళ్ళండి అని మాలిని అంటుంది. వస్తామని మాటిచ్చాం కదా అమ్మ అని శరత్ అంటాడు. నాకన్నా వాళ్లే ఎక్కువ అని మాలిని అంటుంది. ఎక్కువ తక్కువ కాదమ్మా వెళ్లాలి అని మీరా అంటుంది. గుడికి సాయంత్రం వెళ్దాం లేమ్మా మేము అర్జెంట్గా వెళ్లాలి మాలిని అంటూ శరత్ వెళ్లిపోతాడు. కట్ చేస్తే, మాలిని ఏడుస్తుంది. ఏమైంది మాలిని ఎందుకు ఏడుస్తున్నావ్ అని వసుంధర అడుగుతుంది.
డాడీ మీరా గారు గుడికి వెళ్తున్నారు మామ మల్లి తో యాగం చేయించడానికి అని మాలిని జరిగిన విషయం అంతా చెబుతుంది. ఇక్కడ ఒక కూతురు గర్భశోకంతో బాధపడుతుంటే ఒక కూతురు గర్భం దాల్చాలని యాగం జరిపించడానికి వెళ్తారా నాకే విలువ ఇవ్వడం లేదు అనుకున్నాను ఇప్పుడు నిన్ను కూడా పట్టించుకోవడం లేదా అని వసుంధర అంటుంది. ఈ విషయం రాత్రి చెప్పాల్సింది మాలిని వాళ్ళిద్దరిని బయట అడుగు కూడా పెట్టనివ్వకుండా చేసేదాన్ని అని వసుంధర అంటుంది. అలా చేస్తావని చెప్పలేదు మామ్ యాగం జరగాలి మనం అక్కడికి వెళ్లి మధ్యలో అయ్యా గాని ఆపేయాలి ఆ యాగం వాళ్ళు ఎలా పూర్తి చేస్తారో చూద్దాం పదమ్మం అని మాలిని అంటుంది. మాలిని వసుంధర బయలుదేరుతారు. కట్ చేస్తే, ఈ యాగం పూర్తి అయిన తర్వాత మీ మధ్య ఎలాంటి డిస్టబెన్స్ ఉండకూడదు అలాగే తొందరలో ఇంట్లో పిల్లలు తిరగడాలి అని కౌసల్య అంటుంది. మేము ఆ పిల్లలతో ఆడుకోవాలి ఓకేనా అని నీలిమ అంటుంది.
ఇంతలో శరత్ యాగం జరిగే చోటికి వస్తాడు. అమ్మేది నాన్న అని మల్లి అడుగుతుంది. నేను మీ అమ్మ వస్తుండగా మాలిని చూసింది ఎక్కడ యాగానికి అడ్డుపడుతుందని మీ అమ్మ మధ్యలోనే దిగి వెళ్ళిపోయింది అని శరత్ చెబుతాడు. మీ ఇద్దరి ఆశీర్వాదం కావాలని రమ్మన్నాను నాన్న అని మల్లి అంటుంది. యాగం పూర్తయిక్క మీ అమ్మను ఫోన్ చేసి ఇంటికి రప్పించుకుందాం లే మల్లి అని గౌతమ్ అంటాడు. పంతులుగారు మల్లి గౌతమ్ ల చేత యాగం మొదలు పెట్టిస్తాడు. మల్లి గౌతమ్ కంకణాలు కట్టుకుంటారు. మల్లి గౌతమ్ యాగం చేస్తూ ఉంటారు. యాగమాపడానికి వసుంధర మాలిని వస్తూ ఉంటారు.
పంతులుగారు వాళ్ళ చేత పూర్ణాహుతి చేస్తూ ఉండగా వసుంధర వచ్చి వాళ్ళ చేతిలో ఉన్న పూర్ణాహుతిని కింద పడేస్తుంది. ఇక్కడికి వచ్చి యాగం జరిపిస్తున్నారా అని వసుంధర అంటుంది. మాలిని కలశాన్ని కింద పడేస్తుంది. మాలిని ఎందుకు ఇలా చేస్తున్నావ్ అని శరత్ అంటాడు. చిన్న కూతురికి సంతోషం నాకేమో గుండె మంటలా ఎందుకు నాకు అబద్ధం చెప్పారు డాడీ అని మాలిని అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!