తాజాగా వైసీపీ అధినేత, సీఎం జగన్ నిర్వహించిన కార్యకర్తలు, నాయకుల సమావేశం అనంతరం.. ఒక కీలక విషయం చర్చకు వచ్చింది. ఒకరిద్దరు క్షేత్రస్థాయి నాయకులు రాష్ట్రంలో వైసీపీ గ్రాఫ్పై తమ దైన వాదన వినిపించారు. దీనిని సీఎం జగన్ ఎక్కడా అడ్డుకోకుండా వారు చెప్పేది వినేందుకు ప్రాధన్యం ఇచ్చారు. దీంతో నలుగురు నాయకులు.. రాష్ట్రంలో వైసీపీ గ్రాఫ్ 2019తో పోల్చుకుంటే చాలా వరకు తగ్గిపోయిందని చెప్పారు.
దీనికి కారణం.. చెత్తపన్ను, పెట్రోలు చార్జీలు, పంచాయతీలకు నిధులు, నిరుద్యోగం, ధరలు, రోడ్లు లేక పోవడం వంటి పాతకారణాలనే వారు వెల్లడించి.. ఇవన్నీ ఇలా ఉండబట్టే వైసీపీ గ్రాఫ్ పడిపోయిందని చెప్పారు. వాస్తవానికి ఇప్పటి వరకు ఈ తరహాలో సీఎం జగన్ ముందు కు వచ్చిన చెప్పిన నాయకులు లేరు. ఎవరైనా చెప్పాలని అనుకున్నా.. అది పేపర్లు, మీడియా వరకే పరిమితం చేసుకున్నారు. ఇలాతొలిసారి సీఎంజగన్ముందే పార్టీ పరిస్తితిని కుండబద్దలు కొట్టారు.
అంతేకాదు.. వీరిలో ఒకరు 175 సీట్లు కష్టమని చెప్పేశారు. అయితే.. సాధారణంగా ఇలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేసేవారిని సీఎం జగన్ సహించేది లేదు. క్షమించేది అంతకన్నా లేదు. కానీ, తాజా సమావేశంలో మాత్రం ఆయన చాలా ఓర్పుగా వ్యవహరించారు. ఎన్నికలకు ముందు వివాదాలు ఎందుకు అనుకున్నారో.. లేక , నిజంగానే ఉన్న పరిస్థితిని చెబుతున్నప్పుడు కాదని అనడం ఎందుకని నిర్ణయించుకున్నారో.. మొత్తానికి వారు చెప్పేది విన్నారు.
చివరగా సీఎం జగన్ తేల్చింది ఏంటంటే.. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని.. ఆ మాత్రం పెంపు ఉంటే తప్పులేదని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. మనలాగా సంక్షేమ పథకాలు ఇవ్వని ప్రభుత్వాలు కూడా ధరలు పెంచాయని చెప్పుకొచ్చారు. ఇవి పరిగణనలోకి రావని.. క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీవైపే ఉన్నారని తేల్చి చెప్పారు. అయితే, ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని మాత్రం ప్రజలు మరోసారి వివరించాలని.. గ్రాఫ్బాగానే ఉందని.. మీరు టీడీపీ వలలో చిక్కుకుంటున్నారని చెప్పి.. సమావేశాన్ని ముగించారు.