Malli Nindu Jabili March 4 2024 Episode 588: ఇంతలో పోలీస్ వ్యాన్ సౌండ్ వినపడుతుంది. అది విని కంగారు పడుతూ ఉంటాడు గౌతమ్. ఎందుకండీ అలా ఉన్నారు అని మల్లి అడుగుతుంది. ఏమీ లేదు మల్లి ఈ పూట ప్రశాంతంగా వదిలేయి అని గౌతమ్ అంటాడు. పోలీస్ సైరన్ విని మీరు భయపడ్డారు మాలిని అక్క మీ మీద కేసు పెట్టిందని విషయం తెలిస్తే ఎంత బాధ పడతారు మాలిని అక్కతో వెంటనే మాట్లాడాలి అని మల్లి అనుకుంటూ వెళ్లిపోతుంది. కట్ చేస్తే, మీరా మల్లి కి ఫోన్ చేసి మాలిని అమ్మతో మాట్లాడావా అని అడుగుతుంది. మాట్లాడానమ్మా కానీ అక్క కేసు వాపసు తీసుకొను అంటుంది పంతం తో మాట్లాడుతుంది అని మల్లి అంటుంది. ఆ దేవుడి మీద భారం వేయడం తప్ప మనం ఇంకేమీ చేయలేము అని మీరా అంటుంది. అక్క కేసు పెట్టింది అన్న విషయం ఆయనకి ఇంకా తెలియదు పోలీస్ సైరన్ వింటేనే భయపడిపోతున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని మల్లి అంటుంది.
నిజానికి అబద్ధానికి జరిగే యుద్ధం అంత తొందరగా ఆగదమ్మా అని మీరా అంటుంది. దానంతట అదైనా ఆగాలి లేదంటే మనమైనా ఆపాలి లేదంటే యుద్ధంలో చనిపోయినట్టు ఇక్కడ చాలామంది జీవితాలు నాశనం అయిపోతాయి అని మల్లి బాధపడుతుంది. మాలిని నీ చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది అని మీరా అంటుంది. నేను అక్కకి దగ్గరయ్యి కన్నీళ్లు తుడుద్దాం అనుకుంటున్నాను కానీ అక్క అర్థం చేసుకోవట్లేదు అని మల్లి అంటుంది. వాటిని భరించలేక చచ్చిపోవాలనిపిస్తుందని మాట్లాడుతుంది అది వింటే మరింత బాధేస్తుంది మల్లి అని మీరా బాధపడుతుంది. నా దగ్గర కూడా అలాగే మాట్లాడింది అమ్మ అని మల్లి అంటుంది. మంటలను అయితే ఆర్పగలం కానీ గుండెల్లో రగలే మంటని ఎవరు ఆర్పగలం అని మీరా అంటుంది. సరే అక్క ఏం చేస్తుంది అని మల్లి అడుగుతుంది.
మాలిని గుడికి వెళ్ళింది తన మాటలు వింటుంటే ఏం నిర్ణయం తీసుకుంటుందో తెలియట్లేదమ్మ అని మీరా బాధపడుతుంది. నేను వెళ్లి అక్కతో మాట్లాడుతాను తర్వాత నీకు ఫోన్ చేస్తాను అని మల్లి అంటుంది. భగవంతుడు అక్కాచెల్లెళ్ల జీవితలు సక్కగా అయ్యేలా చూడు తండ్రి అని మీరా వేడుకుంటుంది. కట్ చేస్తే, నేను అరవింద్ ఒకరికి ఒకరం విడిచి ఉండలేమని బ్రతుకుతూ ఉండేవాళ్ళం అందుకే ఓర్వలేక నా భర్తని దూరం చేసావా నా భర్తని నా బిడ్డలో చూసుకొని కాలనీ గడిపేద్దాం అనుకున్నాను కానీ నా బిడ్డను కూడా దూరం చేసి నా బాధను చూస్తూ ఆనందిస్తున్నావా నా బిడ్డను నా భర్తను దూరం చేసిన ఆ మల్లి గౌతమ్ లు మాత్రం సంతోషంగానే ఉన్నారు నాకు మాత్రం ఎందుకు ఈ శిక్ష అని మాలిని అడుగుతుంది భగవంతుని. నేను నా బిడ్డ నా అరవింద్ బ్రతికే అదృష్టం ఈ జన్మలో లేదు కాబట్టి నన్ను కూడా చంపెయ్ అని దేవుడి దగ్గర మొరపెట్టుకుంటుంది మాలిని. బయటనుంచి మల్లి చూసి బాధపడుతుంది. ఇంతలో పంతులుగారు వచ్చి మా హారతి తీసుకోండి అని అంటాడు.నా భర్తను చంపిన గౌతమ్ కి శిక్ష పడేలా చేసిన తర్వాతే హారతి తీసుకుంటాను అని మాలిని అంటుంది.
ఇంతలో అక్కడికి ఒక ఇద్దరు వచ్చి పంతులుగారు మా అమ్మాయికి పెళ్లి కుదిరింది మొదటి శుభలేఖ దేవుడి దగ్గర పెట్టి పూజ చేయండి అని శుభలేఖ ఇస్తూ ఉండగా కింద పడుతుంది. ఆ శుభలేఖని మాలిని తీసి వాళ్లకి ఇస్తుంది. వితంతువా నువ్వు అని ఆవిడ అడుగుతుంది. అవును అని మాలిని బాధ పడుకుంటూ చెబుతుంది. పూజారితో నేను చెప్పింది విన్నావు కదా మరి మొదటి శుభలేఖ నువ్వు ఎలా ముట్టుకున్నావ్ చదువుకున్న దానిలా ఉన్నావ్ ఆ మాత్రం జ్ఞానం లేద నీకు అని ఆవిడ తిడుతుంది మాలినిని . మల్లి అది కూడా చూసి బాధపడుతుంది. మాలిని అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒకచోట కూర్చుని ఏడుస్తుంది. అక్క సూటి పోటి మాటలతో బాధ పడుతుంది అక్క విషయంలో నేను ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని మల్లి ఆలోచిస్తుంది. ఇంతలో మల్లి కి గణపతి గురువుగారు చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి అరవింద్ బాబు గారు ఎక్కడో చోట బ్రతికే ఉంటారు
ఆయన అక్క కళ్ళ ముందుకు వస్తే బాగుండు పూర్వ వైభవం తనకు వచ్చేస్తుంది అని మల్లి అనుకుంటుంది. ఇంతలో ఒక అతను అరవింద్ అని పిలుస్తూ ఉంటాడు. ఆ మాట విన్న మాలిని పరిగెత్తుకు వెళ్లి అతని చెయ్యి పట్టుకుంటుంది. ఎవరు మీరు నేను మీకు తెలుసా మీరు నాకు తెలియదు అని అతను అంటాడు. సారీ అండి అని మాలిని చెబుతుంది. ఇంతలో వాళ్ళ ఫ్రెండ్ వచ్చేయ్ రా అరవి0ద్ పదరా అని తీసుకెళ్లిపోతాడు ఆ వ్యక్తిని. నా అరవింద్ బ్రతికి లేడు నేనే బ్రమ పడుతున్నాను అని మాలిని బాధపడుతుంది. అక్క ఇప్పుడు కనిపించింది నీ భర్త కాకపోవచ్చు కానీ ఎప్పుడూ ఒకప్పుడు అరవింద్ బాబు గారు నీ కళ్ళ ముందుకు వస్తారు అక్క అని మల్లి అంటుంది. ఎందుకు మల్లి నాలో ఇంక లేనిపోని ఆశలు రేపుతున్నావు అని మాలిని అంటుంది. నువ్వు రా నాతో రాక్క అని మాలిని మల్లి తీసుకు వెళుతుంది.
కట్ చేస్తే,మాలిని గుడికి వచ్చి చాలాసేఫ్ అయింది ఎక్కడికి వెళ్ళింది అని వసుంధర అక్కడికి వచ్చి వెతుకుతుంది. ఈరోజు అమ్మవారి సాక్షిగా ఒక పని చేయబోతున్నాను ఈరోజు నేను చేసిన పని మంచిదైతే అమ్మవారు నిన్ను ఆశీర్వదిస్తుంది నేను చేసేది తప్పయితే నన్ను శిక్షిస్తుంది అని మల్లి కుంకుమ తీసి మాలిని నుదుటిన బొట్టు పెడుతుంది. మల్లి ఏం చేస్తున్నావ్ నువ్వు అని మాలిని అంటుంది. నువ్వేమీ మాట్లాడకు అక్క అని మల్లి గాజులు తీసి చేతికి వేస్తుంది పూలు తీసి తలలో పెడుతుంది.అది చూసి ఆశ్చర్య పోతుంది వసుంధర.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!