Malli Nindu Jabili March 6 2024 Episode 590: మల్లి గౌతమ్ ని రక్షించుకోవడానికి అలా చేసింది కానీ నేనైతే నిన్ను ఇలాగే చూడాలనుకుంటున్నాను నీకు మరో పెళ్లి చేయాలనుకుంటున్నాను నువ్వు నిండు ముత్తైదువుల పసుపు కుంకుమ గాజులు పెట్టుకొని కలకాలం ఉండాలి అని వసుంధర అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ మామ్ అరవింద్ ని మర్చిపోయి మరో పెళ్లి చేసుకోవడమేంటి అని మాలిని అంటుంది. చూడుమాలిని జీవితం నీటి మీది బుడగ లాంటిది ఉన్నన్నాళ్ళు ఆనందంగా ఉండాలే కానీ కష్టాలు కన్నీళ్ళతో గడపకూడదు అని వసుంధర అంటుంది. అరవింద్ జ్ఞాపకాలు పలక మీద రాసుకున్న రాతలు కాదు చెడిపేస్తే చెదిరిపోవడానికి ఏడేళ్ల మా ప్రేమని జీవితాంతం గుర్తు పెట్టుకునే బ్రతుకుతాను అంతేకానీ ఇంకో అతన్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఎలా ఉండగలను అని మాలిని అంటుంది. అవన్నీ మాటల్లో చెప్పడానికే బాగుంటాయి నిజజీవితంలో ఒంటరిగా బ్రతకడం కష్టం మాలిని ఒక తల్లిగా ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో అరవింద్ బ్రతికి ఉంటే మొదట నీకే ఫోన్ వచ్చేది ఆ మల్లికెందుకు ఫోన్ చేస్తాడు చెప్పు రేపు తెల్లారేసరికేళ్ళా ఏదో ఒక నిర్ణయం తీసుకో రేపు
నువ్వు కొత్త జీవితాన్ని ఆరంభించాలి అని వసుంధర అంటుంది. చూసావా అరవింద్ నువ్వు నన్ను ఎలాంటి పరిస్థితుల్లో వదిలేసి వెళ్లిపోయావు మన ఏడేళ్ల ప్రేమని మర్చిపోయి మరో పెళ్లి చేసుకొని ఆనందంగా ఉండాలంట అది నావల్ల కాదు అని మాలిని ఏడుస్తుంది. కట్ చేస్తే, అయిపోయిందా నీ సంఘ సేవ అని గౌతమ్ అంటాడు.మాలిని అక్క బాధ చూడలేక వెళ్ళొస్తున్నాను అని మల్లి అంటుంది. అందరి బాధలు అర్థం చేసుకుంటావు నా బాధ మాత్రం అర్థం చేసుకోవు నీ భర్తని జైలుకు పంపించాలి అనుకున్న వాళ్లతో నువ్వెందుకు మాట్లాడనుకుంటున్నావు అని గౌతమ్ అంటాడు. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అని మల్లి అంటుంది. చూడు మల్లి ఒక్కరి కోసం మనం బ్రతకడం లేదు పిల్లలు కావాలన్నా నా ఆలోచనని నువ్వు అంగీకరించడం లేదు నువ్వు ఇంకా ఇలాగే లేట్ చేస్తే పిల్లల విషయంలో నేను వేరొక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అని గౌతమ్ అంటాడు.
అంటే ఏంటండీ మీ ఉద్దేశం అని మల్లి అంటుంది. ఇప్పుడు చెప్పను అదేంటో ముందు ముందు నీకే తెలుస్తుంది అని గౌతమ్ అంటాడు. మాలిని నామీద కేసు పెట్టింది ఆ విషయం నీకు చెబితే నువ్వు ఎక్కడ సఫర్ అవుతావో అని చెప్పలేదు అని గౌతమ్ అంటాడు. నాక్కూడా విషయం తెలిసిందండి అందుకే మాలిని అక్కను బ్రతిమలాడుతున్నాను అని మల్లి అంటుంది. ఒకరు బ్రతిమిలాడినంత మాత్రాన మనల్ని వదిలిపెడతారని ఎందుకు అనుకుంటున్నావు మల్లి అని గౌతమ్ అంటాడు. ఏదో ఒకటి చేసి మాలిని అక్క నువ్వు ఒప్పిస్తాను అని మల్లి అంటుంది. కట్ చేస్తే, సిఐ గారు వసుంధర కి ఫోన్ చేసి మాలిని కేసు పెట్టింది మీ ఇంటి దగ్గర సాక్షిని విచారించడానికి వస్తున్నామని ఫోన్ చేసి చెబుతాడు. శంకరమ్మ మాలిని గౌతమ్ మీద కేసు పెట్టింది ఇప్పుడు విచారించడానికి పోలీసులు మన ఇంటికి వస్తున్నారు ఆ గౌతమ్ అరవింద్ ని చంపించాడని
ఒక్క మాట చెప్పు చాలు మిగతాదంతా వాళ్ళే చూసుకుంటారు అని వసుంధర అంటుంది. నువ్వు అబద్ధం చెప్పలేవని నాకు తెలుసు శంకరమ్మ కానీ నువ్వు చెప్పే సాక్ష్యం మీదనే ఆధారపడి ఉంటుంది నీకు ఒక కూతురు ఉంది కదా నా బాధ ఏంటో నీకు తెలుసు కదా అరవింద్ చనిపోయిన నుంచి నా కూతురికి ఆకలి దప్పిక లేదు కంటికి నిద్ర లేదు అలా పడి ఏడుస్తూ ఉంటుంది దాని బాధ తీరాలంటే నువ్వు సాక్ష్యం చెప్పాలి అని వసుంధర అంటుంది. అసలు ఆరోజు నేను అరవింద్ బాబు ను చంపుతుండగా ఎందుకు చూడాలి మీ ఇంటికి ఎందుకు వచ్చి చెప్పాలి అని శంకరమ్మ అంటుంది. నువ్వు నిజం చెప్పకపోతే నా ఇంట్లో ఉండాల్సిన అవసరం నీకేంటి శంకరమ్మ
నీ వల్ల మాకు ఉపయోగం ఏంటి అని వసుంధర అంటుంది. వద్దు శంకరమ్మ గౌతమ్ బాబుని కేసులో ఇరికించి నువ్వు తప్పు చేయొద్దు అని మీరా అనుకుంటుంది. కట్ చేస్తే, ఇంతలో సిఐ గారు పోలీసుల్ని తీసుకొని వస్తారు. రా శంకరమ్మ నువ్వు చెప్పే సాక్ష్యం మీదే ఆధారపడి ఉంటుంది పోలీసులు వచ్చారు అని వసుంధర శంకరమని తీసుకొని వస్తుంది. అమ్మగారు అని మీరా పిలుస్తుంది. నువ్వు రాకు పో అని వసుంధర అంటుంది. హాయ్ సార్ మాలిని కేసు పెట్టింది సాక్షిని విచారించడానికి వచ్చాం అని సిఐ చెబుతాడు. ఇంకా ఏవి ఆధారాలు దొరకలేదా అని శరత్ అంటాడు. లేదు సార్ మీ ఇంట్లో ఉన్న శంకరమ్మ చెబితే కానీ యాక్షన్ తీసుకోలేము అని సీఐ అంటాడు. శంకరమ్మ అరవింద్ బాబుని గౌతమ్ నంద చంపాడని మాలిని కేసు పెట్టింది అందుకు నువ్వే ప్రత్యక్ష సాక్ష్యం నువ్వు చెప్పే సాక్ష్యం మీదే ఆధారపడి ఉంటుంది చెప్పు గౌతమ్ చంపుతూ ఉండగా నువ్వు చూసావా అని సీఐ శంకరమణి అడుగుతాడు.
చెప్పు శంకరమ్మ గౌతమ్ చంపడానికి చెప్పు అని వసుంధర అంటుంది. అమ్మగారు అని మీరా అంటుంది.నీకు ఇక్కడ ఏంటి పని బయటికి పో అని వసుంధర బెదిరిస్తుంది. చూడు శంకరమ్మ నువ్వు చూసింది చూసినట్టు చెప్పు ఎవరికి భయపడకు అని శరత్ అంటాడు. మీ ఆరాటం ఏంటో నాకు అర్థం అవుతుంది అని వసుంధర అంటుంది. అరవింద్ ని ఆరోజు ఎంతమంది చంపేశారు అని సిఐ అంటాడు. ఆరోజు అరవింద్ బాబుని నలుగురు మనుషులు కొట్టి చంపేశారు బాబు అని శంకరమ్మ అంటుంది. వాళ్లని నువ్వు గుర్తుపట్టగలవా మా స్టేషన్లో కొంతమంది ఫోటోలు ఉన్నాయి వాళ్లను చూసి హత్య చేసింది ఎవరో చెప్పగలవా అని సిఐ గారు ఒక ఇద్దరు ఫోటోలు చూపెడతాడు. వాళ్లు కాదని చెబుతుంది శంకరమ్మ. గౌతమ్ ఫోటో చూపెడతాడు సీఐ.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది