ప్రముఖ దర్శకుడు మణిరత్నం క్షేమంగానే ఉన్నారు. గుండెకు సంబంధించి చెకప్పుల కోసం ఆసుపత్రికి చేరుకున్న ఆయ క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్లారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటంతో, సోమవారం మళ్లీ కార్యాలయానికి కూడా వెళ్లారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో చారిత్రాత్మక నవల `పొన్నియిన్ సెల్వన్` తెరకెక్కనుంది. ఈ నవలను తెరకెక్కించాలన్నది ఆయన చిరకాల కల. ఈ సినిమా కోసం ఇప్పటికే ఇండియన్ సినిమా స్టార్వాల్ట్ లను ఎంపిక చేస్తున్నారు. టాలీవుడ్ నుంచి మోహన్బాబు ఆ సినిమాకోసం సంతకం చేశారు. బాలీవుడ్ ఐశ్వర్యా రాయ్ కూడా ఆనందంగా ఈ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. అంతా సవ్యంగా ఉందనుకున్న సమయంలో ఆదివారం మణిరత్నం గుండెకు సంబంధించిన ఇబ్బందితో చెన్నై గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆసుపత్రికి వెళ్లారు. ఆ విషయాన్ని కోలీవుడ్ డిజిటల్ మీడియా ప్రొఫెషనల్ ఒకరు ట్వీట్ చేశారు. దీంతో మణిరత్నం నాలుగో సారి గుండెపోటుకు గురయ్యారని వార్తలొచ్చాయి. అయితే సోమవారం పీ ఆర్వో నిఖిల్ మురుగన్ చేసిన ట్వీట్ ప్రకారం, మణిరత్నం క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చారు. సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. రెగ్యులర్ చెకప్పుల నిమిత్తం ఆసుపత్రికి వెళ్లారంతే.
ఇంతకు ముందు ఎప్పుడంటే…!
`యువ` సమయంలో ఆయనకు తొలిసారి గుండెపోటు వచ్చింది. ఆ తర్వాత మళ్లీ `ఓకే బంగారం` సమయంలో కాశ్మీర్లో సెకండ్ అటాక్ వచ్చింది. ఆ మధ్య మూడో సారి అనారోగ్యం అంటూ వార్తలొచ్చాయి. మణిరత్నం గుండెనొప్పితో బాధపడుతున్నారని వార్తలు రావడం ఇది నాలుగో సారి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!