నటుడు, మాజీ ఎం.పి, విద్యానికేతన్ సంస్థల అధినేత డా.మోహన్బాబును ఈరోజు పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ పథకం క్రింద ఇవ్వాల్సిన మొత్తాన్ని ఇవ్వలేదని ఇది వరకే ప్రకటించిన మోహన్బాబు .. నేడు ప్రభుత్వం ఫీజు రియంబర్స్ చెల్లించడంలో ఆలస్యం చేస్తుందని వేలాది మంది విద్యానికేతన్ విద్యార్థులతో కలిసి విద్యానికేతన్ విద్యా సంస్థల నుండి తిరుపతి వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. నిరసన ర్యాలీకి పిలుపునిచ్చారు. అయితే బాబు వ్యూహాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం నిర్ణయించుకుంది. పోలీసులు మోహన్బాబును హౌస్ అరెస్ట్ చేశారు. అయితే తన నిరసనను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగిస్తానని మోహన్ బాబు అంటున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తం అవుతుందని పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం.
previous post
next post
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!